YS Sharmila : దత్తపుత్రుడు జగనే : వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
ప్రధానాంశాలు:
YS Sharmila : దత్తపుత్రుడు జగనే : వైఎస్ షర్మిల
YS Sharmila : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి Ys Jagan ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను Pawan Kalyan చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ సంబోధిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందిస్తూ.. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దత్తపుత్రుడు అని చెప్పారు.

YS Sharmila : దత్తపుత్రుడు జగనే : వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
అసెంబ్లీకి వెళ్లేందుకు ధైర్యం లేని జగన్
జగన్ నిన్న జైలులో వల్లభనేని వంశీని కలవడా్ని సైతం ఆమె విమర్శించారు. ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి అనేక సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పరామర్శించడం ద్వారా జగన్ తప్పుడు ఉదాహరణను చూపారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి జైలులో నేరస్థులను కలువడానికి సమయం ఉంది, కానీ ప్రజల కోసం అసెంబ్లీకి హాజరు కావడానికి ఆయనకు ముఖం లేదని షర్మిల విమర్శించారు. ప్రెస్ మీట్లు నిర్వహించడానికి మరియు తన కథనాలను వివరించడానికి ఆయనకు సమయం దొరుకుతుంది, కానీ అసెంబ్లీలో అధికార పార్టీని ప్రశ్నించే ధైర్యం ఆయనకు లేదని దుయ్యబట్టారు.
వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
ప్రజలచే ఎన్నికైనప్పటికీ అసెంబ్లీకి దూరంగా ఉన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే హక్కు లేదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదు. మళ్ళీ అసెంబ్లీకి హాజరయ్యే ధైర్యం లేకపోతే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని షర్మిల అన్నారు.
తరచూ వైయస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా షర్మిల తరచూ తమని నిలదీస్తుండడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని.. ఎన్నెన్నో ప్రభుత్వ వైఫల్యాలు వెలుగు చూస్తుంటే షర్మిల కనీసం విమర్శలు చేయడం లేదని.. ఇంట్లో ఉండి సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం అవుతున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.