
Pensions : ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పింఛన్లు కట్..!
Pensions : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తోంది. అయితే పెన్షన్లు అందుకుంటున్న వారిలో అర్హత లేని వారు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రభుత్వం అధికార యంత్రాంగంతో సర్వే చేయించింది. ముఖ్యంగా దివ్యాంగ సర్టిఫికెట్లతో పెన్షన్లు అందుకుంటున్న వారి వివరాలు సేకరించింది.రాష్ట్ర వ్యాప్తంగా 8,18,900 మంది మెడిక్, వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్లను తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ప్రభుత్వం ఈ తరహా పెన్షన్ల వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పెన్షన్లు అందుకుంటున్న వారిని ఫిజికల్గా వెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీమ్లను నియమించింది. మెడికల్ ఫింఛన్ దారులను వారి ఇంటివద్ద మెడికల్ టీమ్ లు తనిఖీలు కొనసాగిస్తున్నాయి.
Pensions : ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పింఛన్లు కట్..!
ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు పీజీ వైద్య విద్యార్ధులు రోజుకు 200 మంది లబ్దిదారులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి పెన్షనర్ల పరిశీలన ఉంటుంది. పెన్షనర్లంతా తప్పనిసరిగా వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలకు హాజరు కాకుంటే పెన్షన్ నిలిచిపోనుంది. చాలామంది తప్పుడు వైకల్య ధ్రువపత్రాలు పెట్టి పింఛన్లు పొందుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పింఛన్లకు సంబంధించి తనిఖీ జరుగుతోంది. బోగస్ అని తేలితే వెనువెంటనే తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
లబ్దిదారులకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయిస్తున్నారు. పింఛన్ దారులను తనిఖీ చేసే టీమ్లో ఆర్ధోపెడీషియన్, జనరల్ పిజీషియన్, పిహెచ్సి మెడికల్ ఆఫీసరు, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. ఏ కారణంతో పెన్షన్ తీసుకొంటున్నారో సంబంధిత వైద్యుల ద్వారా రీ వెరిఫికేషన్ జరుగనుంది. ఈ ప్రక్రియలో బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నట్లుగా గుర్తిస్తే వారికి సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరీశీలన పూర్తయిన తర్వాత ప్రభుత్వం వీరికి తొలుత నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత పెన్షన్ల రద్దు నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
This website uses cookies.