Categories: andhra pradeshNews

Pensions : ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పింఛన్లు కట్..!

Pensions : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తోంది. అయితే పెన్షన్లు అందుకుంటున్న వారిలో అర్హత లేని వారు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్ర‌భుత్వం అధికార యంత్రాంగంతో సర్వే చేయించింది. ముఖ్యంగా దివ్యాంగ సర్టిఫికెట్లతో పెన్షన్లు అందుకుంటున్న వారి వివరాలు సేకరించింది.రాష్ట్ర వ్యాప్తంగా 8,18,900 మంది మెడిక్‌, వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్లను తీసుకుంటున్న‌ట్లుగా ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ప్రభుత్వం ఈ తరహా పెన్షన్ల వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పెన్షన్లు అందుకుంటున్న వారిని ఫిజికల్‌గా వెరిఫికేషన్‌ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీమ్‌లను నియమించింది. మెడికల్‌ ఫింఛన్‌ దారులను వారి ఇంటివద్ద మెడికల్‌ టీమ్‌ లు తనిఖీలు కొనసాగిస్తున్నాయి.

Pensions : ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పింఛన్లు కట్..!

Pensions దివ్యాంగుల‌కు వైద్య ప‌రీక్ష‌లు

ఈ నేప‌థ్యంలో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు పీజీ వైద్య విద్యార్ధులు రోజుకు 200 మంది లబ్దిదారులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి పెన్షనర్ల పరిశీలన ఉంటుంది. పెన్షనర్లంతా తప్పనిసరిగా వైద్య పరీక్షలకు హాజ‌రు కావాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలకు హాజరు కాకుంటే పెన్షన్ నిలిచిపోనుంది. చాలామంది తప్పుడు వైకల్య ధ్రువపత్రాలు పెట్టి పింఛన్లు పొందుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పింఛన్లకు సంబంధించి తనిఖీ జరుగుతోంది. బోగస్ అని తేలితే వెనువెంటనే తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

నోటీసులు – రద్దు

లబ్దిదారులకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయిస్తున్నారు. పింఛన్‌ దారులను తనిఖీ చేసే టీమ్‌లో ఆర్ధోపెడీషియన్‌, జనరల్‌ పిజీషియన్‌, పిహెచ్‌సి మెడికల్‌ ఆఫీసరు, డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉంటారు. ఏ కారణంతో పెన్షన్ తీసుకొంటున్నారో సంబంధిత వైద్యుల ద్వారా రీ వెరిఫికేషన్ జ‌రుగ‌నుంది. ఈ ప్రక్రియలో బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నట్లుగా గుర్తిస్తే వారికి సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరీశీలన పూర్తయిన తర్వాత ప్రభుత్వం వీరికి తొలుత నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత పెన్షన్ల రద్దు నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

Recent Posts

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

53 minutes ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

2 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

3 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

4 hours ago

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

13 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

14 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

15 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

16 hours ago