Categories: andhra pradeshNews

Anchor shyamala : భీమిలి నియోజకవర్గంలో యాంకర్ శ్యామల… వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారాలు…!

Anchor shyamala : ప్రస్తుతం రాజకీయాలలో సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొంటూ వారికి నచ్చిన రాజకీయ నాయకులకు మద్దతుగా నిలుస్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తరఫున హైపర్ ఆది డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కూడా వారి పనులను పక్కన పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ కోసం పలుచోట్ల ప్రచారాలు చేస్తున్నారు. ఇక వైసీపీ తరఫున టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్యామల మద్దతుగా నిలుస్తూ ప్రచారాలలో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల శ్యామల భీమిలిలోని వైయస్ఆర్ కాలనీలో ప్రచారాలు చేపట్టారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జగనన్నను గెలిపించడానికి మేము సిద్ధం అంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు.

Anchor shyamala : మీడియాతో ముచ్చటించిన యాంకర్ శ్యామల…

ఇక ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి అవంతి శ్రీనివాసరావు గారి పై మీకు ఉన్న అభిమానం మిమ్మల్ని ఇలా చూస్తేనే అర్థమయిపోతుంది. ఇక ఇతర పార్టీ మీటింగ్స్ చూసినట్లయితే అరుచుకుంటూ బూతులతో జరుగుతుంటే వైసీపీ పార్టీ మీటింగ్స్ , క్యాంపెయిన్లు చూసినట్లయితే ప్రేమ ఆప్యాయత జనాదరణతో నిండుతూ జరుగుతున్నాయని శ్యామల తెలియజేశారు. ఈ ఒక్క విషయం చాలు జగన్ ప్రభుత్వం ఏంటో తెలియడానికని తెలిపారు. ఇక వైయస్ఆర్ కాలనీలో నిలుచుని వైయస్ఆర్ పార్టీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదని ఎందుకంటే నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలిసే ఉంటుందని శ్యామల వ్యాఖ్యానించారు. ఇక అవంతి గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆయన పాలనలో ప్రజలకు మద్దతుగా నిలుస్తూ తగిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఆయన గురించి నాకంటే బాగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ఈ సంక్షేమం ఇలాగే సాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నను గెలిపించాల్సిందిగా శ్యామల కోరారు. కావున 13వ తారీకు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో వైసీపీ పార్టీని గెలిపించాల్సిందిగా ఆమె కోరారు.

Anchor shyamala : భీమిలి నియోజకవర్గంలో యాంకర్ శ్యామల… వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారాలు…!

మీటింగ్ ముగిసిన అనంతరం మీడియాతో ముచ్చటించిన యాంకర్ శ్యామల ఆమె వైసీపీ పార్టీలోకి 2019లో చేరినట్లుగా తెలియజేశారు. తాను ఈ పార్టీలో చేరినప్పుడు మొట్ట మొదటిసారి క్యాంపెనింగ్ చేసింది అవంతి శ్రీనివాసరావు గారికేనని , ఇక ఆ సమయంలో భీమిలి నియోజకవర్గానికి వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి మేము అవంతి గారి వైపే ఉంటామని అన్నారు. అన్నట్లుగానే గత ఎన్నికలలో వారిని గెలిపించారని శ్యామల తెలియజేశారు. అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందితేనే నాకు ఓటు వేయమని అడిగే ఒకే ఒక్క నాయకుడు జగనన్న మాత్రమేనని తెలియజేశారు. ఇక ఈ ఓట్లలో ఎమ్మెల్యేని ఎంపీలను ఎంచుకోవడం కాదని రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని యాంకర్ శ్యామల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సూచించారు. హామీలను ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటు వేస్తారా లేదా హామీలను , మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వాలకు ఓటు వేస్తారా కాస్త ఆలోచించి వేయండి అంటూ శ్యామల ఈ సందర్భంగా తెలిపారు.

Recent Posts

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

12 minutes ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

9 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

10 hours ago

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…

11 hours ago

AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..?

AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…

12 hours ago

YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసుల‌పై హైకోర్టు సీరియ‌స్‌

YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…

13 hours ago

Mother : 90 ఏళ్ల త‌ల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ త‌ల్లి చేసిన ప‌నికి అమ్మా అని ప‌రుగులు..!

Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయ‌న్న దానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎంతో కష్టపడి, కన్న…

14 hours ago

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…

15 hours ago