
AP Elections : గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ... నిరాశలో కూటమి..!
AP Elections : ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికలు నిన్నటితో ముగుస్తాయి. ఇక ఇప్పుడు రాష్ట్రమంతా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముగిసిన తర్వాత వైసీపీ పార్టీ ఆనందోత్సవాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక కూటమి వైపు చూసినట్లయితే కాస్త నిరాశ కనిపిస్తోంది. దీనికి గల ముఖ్య కారణం పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైసీపీ పార్టీ శ్రేణులు ముందస్తుగా కనిపించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో రెట్టింపు జోష్ తో వీరంతా కదిలి పని చేశారు. ఇక నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు ,దివ్యంగుల సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు మరియు నేటి యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఓటు వేసిన తర్వాత వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూస్తుంటే వైసీపీ పార్టీకి ఉత్సాహం ఉరుకలేస్తుంది. ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అవడం ఖాయం అంటూ వైసీపీ పార్టీ శ్రేణులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పలు ముఖ్య నేతలు అందరూ కూడా పోలింగ్ సరళి పై ఒక అంచనాకు వచ్చారు. దీంతో నిన్న ఎన్నికలకు పోటెత్తి వచ్చిన ఓటర్లు ముఖ్యంగా మహిళలు వృద్ధులు గ్రామీణులే ఎవరు గెలుస్తారనేది నిశ్చయించారని తెలుస్తోంది. అయితే ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం జగన్ 59 నెలల సంక్షేమ పాలనకు మెచ్చి మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో జూన్ 4 వరకు ఎన్నికల ఫలితాల కోసం ఉత్సహంగా ఎదురు చూడాల్సిన అవసరం లేదని , జగన్ గెలుపు నిన్ననే నిశ్చయమైందంటూ వైసీపీ పార్టీ నేతలు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరికి ఒకరు అభినందనలు చెప్పుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం వైసీపీ పార్టీ కార్యాలయాలు కార్యకర్తల కేరింతలతో ఉల్లాసంగా మారాయి.
AP Elections : గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ… నిరాశలో కూటమి..!
మరోవైపు కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల్లో నిరాశ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ సరళి మేరకు నిరాశ్యం ఏర్పడి అసహనం పెరిగి పలు ప్రాంతాలలో దాడులకు కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ ఓటర్లు ప్రలోభాలకు లొంగలేదని తెలుస్తోంది. ఓటమి భయంతోనే కూటమి నేతలు గొడవలకు దిగారని అయినప్పటికీ ఓటర్లు బెదర్లేదని పలువురు చెబుతున్నారు. పోలింగ్ ఉదయం నుండి ప్రారంభం కాగా బారులు తిరిన ఓటర్లు వైసీపీ పార్టీ గెలుపును ఆకాంక్షించారని అంటున్నారు.
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
Whatsapp : వాట్సాప్ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…
Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…
Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…
Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…
Telangana Municipal Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. పట్టణ స్థానిక…
PM Surya Ghar Yojana : దేశంలో విద్యుత్ ఛార్జీలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతున్నాయి.…
OPPO Find X9 Ultra Review : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) గ్లోబల్ మార్కెట్లో తన మోస్ట్…
This website uses cookies.