Thalliki Vandanam : “తల్లికి వందనం” నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకానికి సంబదించిన నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ.15,000 నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం ద్వారా తల్లుల పాత్రను గుర్తించి విద్యలో వారి భాగస్వామ్యాన్ని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. విద్యార్థులు పాఠశాలకు తరచుగా హాజరయ్యేలా చేయడంతోపాటు, తల్లులు విద్యపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ ఆర్థిక ప్రోత్సాహం దోహదపడనుంది.
Thalliki Vandanam : “తల్లికి వందనం” నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్
ఇక పాఠశాలల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తెరతీసింది. ప్రతి విద్యార్థికి సంబంధించి పాఠశాల మెయింటెనెన్స్ కోసం సంబంధిత జిల్లా కలెక్టర్ ఖాతాకు రూ.2,000 జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నిధులను శుభ్రత, మౌలిక వసతులు, చిన్న మరమ్మత్తుల వంటి అవసరాలకు వినియోగించవచ్చు. పాఠశాలల పరిశుభ్రతను మెరుగుపరచడం, విద్యార్థులకు మంచి వాతావరణాన్ని కల్పించడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ఈ చర్య ప్రభావం చూపనుంది.
“తల్లికి వందనం” పథకం ఇప్పటికే గత సంవత్సరాల్లో మంచి ఫలితాలను అందించిన నేపథ్యంలో, 2025-26లో మరింత పటిష్టంగా అమలయ్యేందుకు ప్రభుత్వం ముందంజ వేసింది. ఈ పథకం వల్ల తల్లుల ఆర్థిక భద్రత పెరగడమే కాదు, విద్యార్థుల చదువుపై కుటుంబాల దృష్టి మరింతగా పెరుగుతుంది. తల్లులను విద్యాభివృద్ధిలో భాగస్వాములుగా మార్చే ఈ కార్యక్రమం రాష్ట్రానికి ఒక మార్గదర్శకంగా నిలవనుంది.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.