Ap : ఏపీ రూపురేఖలు మార్చేసే ప్రాజెక్టు.. పూర్తయితే జగన్ కు తిరుగుండదా..?

Ap : ఏపీలో ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమపాళ్లలో నిర్వహిస్తున్నారు సీఎం జగన్. మరీ ముఖ్యంగా ఒక్క చోటనే అభివృద్ధిని కేంద్రీకరించకుండా.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే కడపలో కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం వైఎస్సార్‌ ఈఎంసీ(ఎలాక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌). ఈ ప్రాజెక్ట్‌ను కడప జిల్లాలోని కొప్పర్తి గ్రామ సమీపంలో నిర్మిస్తున్నారు. దీన్ని 2020లో శంఖుస్థాపనలు చేసి ప్రారంభించారు సీఎం జగన్.

ఏపీలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు వారిని ఆర్థికంగా బలపర్చే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే యుద్ధప్రాతిపదకన పనులు చేయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలకు స్థలాలు కేటాయించారు. అయితే ఇది ఇప్పటిది కాదండోయ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే కడపలో ఓ పెద్ద కంపెనీని ఏర్పాటు చేయాలని భావించారు. దాన్ని ఇప్పుడు జగన్ పూర్తి చేస్తున్నారు. దీన్ని మొదట్లో 540 ఎకారాల్లో స్టార్ట్ చేసి.. ఆ తర్వాత 801 ఎకరాలకు విస్తరిస్తున్నారు. కంపెనీలకు ప్రధానంగా నీరు, కరెంట్, స్థలాలు కేటాయిస్తే కచ్చితంగా ప్రపంచంలోనే పెద్ద కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతాయి.

ఈ విషయాన్ని జగన్ కూడా పసిగట్టారు. అందుకే ఇప్పుడు ఇలాంటికంపెనీలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది నేషనల్‌ హైవే 67 కేవలం 5.7 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అలాగే.. కృష్ణాపురం రైల్వేస్టేషన్ 4.9 కి.మీ, కడప రైల్వే స్టేషన్-10.8 కి.మీల దూరంలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ భాగాలు, మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీ.. వాటితో పాటు కెమెరాలు, బ్యాటరీలు, ఛార్జర్ లు తయారు చేస్తున్నారు. వాటితో పాటు మెడికల్, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తయారు చేయబోతున్నారు. ఇందులో మొత్తం రూ.10 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది గనక మొత్తం పూర్తి అయితే దాదాపు ఏపీలోని 30 వేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ హబ్ గా తయారవుతుంది. ఒక రకంగా ఇది రాయలసీమకే ప్రసిద్ధి గాంచిన కంపెనీగా మారుతుంది. దాని వల్ల మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

Share

Recent Posts

Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…

5 minutes ago

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…

30 minutes ago

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…

1 hour ago

YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?

YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…

2 hours ago

Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా… ఇలా చేస్తే ఇదే జరుగుతుంది…?

Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…

3 hours ago

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

Telangana  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…

4 hours ago

LIC Recruitment 2025 : గ్రాడ్యుయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఎల్ఐసీలో ఉద్యోగావకాశాలు

LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్‌ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…

5 hours ago

Curry Leaves : ఈ ఆకులని జ్యూస్ గా చేసి తాగారంటే… రేచీకటితో పాటు.. ఎన్నో వ్యాధులు పరార్…?

Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు.…

6 hours ago