
AP Retaining Wall : వరదల సమయంలో రిటైనింగ్ వాల్పై రాజకీయ రగడ.. దాని ఘనత ఎవరిది?
AP Retaining Wall : ఏపీలో వరదలు ప్రజలని భయబ్రాంతులకి గురి చేయడం మనం చూశాం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కృష్ణానది వద్ద కట్టించిన రిటైనింగ్ వాల్ వ్యవహారం ఏపీలో వరదలు కొనసాగుతున్న క్రమంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ఓవైపు విజయవాడను వరదలు ముంచెత్తి అనేక ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలి పునరావస కేంద్రాలకు తరలి వెళ్లి ఇబ్బందులు పడుతుంటే టిడిపి, వైసిపి శ్రేణులు కృష్ణలంక వద్ద నిర్మించిన రిటైనింగ్ వాల్ వ్యవహారంపైన సోషల్ మీడియా వేదికగా తిట్టిపోసుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణలంక, రామలింగేశ్వనగర్ తదితర ప్రాంతాలు వరద ముంపు నుంచి బయటపడ్డాయి.
ఈ రిటైనింగ్వాల్ ఘనత తమదేనని చెప్పుకునేందుకు వైసీపీ నానా అవస్థలు పడుతోంది. వాస్తవానికి కరకట్ట గోడను టీడీపీ హయాంలోనే సగానికిపైగా పూర్తి చేశారు. మొత్తం 4.7 కిలోమీటర్ల వాల్ నిర్మాణం మూడు ఫేజ్లలో నిర్మాణం చేయాల్సి ఉంది. మొదటి ఫేజ్ 2.37 కి.మీ. యనమలకుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు రూ.165 కోట్లు, రెండో ఫేజ్ 1.23 కి.మీ. గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు రూ.126 కోట్లు, మూడో ఫేజ్ 1.01 కి.మీ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు రూ.110 కోట్లతో టీడీపీ హయాంలో 2016లోనే అంచనాలు తయారు చేయించారు. అయితే వైసీపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృష్ణలంక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని కృష్ణలంక వాసులు చెబుతున్నారని పోస్ట్ పెట్టింది.
AP Retaining Wall : వరదల సమయంలో రిటైనింగ్ వాల్పై రాజకీయ రగడ.. దాని ఘనత ఎవరిది?
ఇక ఈ పోస్టులపైన తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నారు. కృష్ణలంక వద్ద రిటైనింగ్ వాల్ 2019లో చంద్రబాబు హయాంలో నిర్మించబడిందని కృష్ణలంక ప్రజలకు మేలు చేసింది జగన్ కాదు చంద్రబాబు అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు అబద్ధాలు చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా నాడు చంద్రబాబు హయాంలో పూర్తయిన రిటైనింగ్ వాల్ విజువల్స్ పోస్ట్ పెట్టారు. మొత్తం మేమే చేశామని వైసీపీ చెబుతుంటే.. అరే బాబోయ్ చరిత్ర తెలుసుకోకపోతే ఎలా..? టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పడేస్తోంది. దీంతో ఈ వ్యవహారం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ అయ్యింది.
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
This website uses cookies.