AP Retaining Wall : వరదల సమయంలో రిటైనింగ్ వాల్పై రాజకీయ రగడ.. దాని ఘనత ఎవరిది?
AP Retaining Wall : ఏపీలో వరదలు ప్రజలని భయబ్రాంతులకి గురి చేయడం మనం చూశాం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కృష్ణానది వద్ద కట్టించిన రిటైనింగ్ వాల్ వ్యవహారం ఏపీలో వరదలు కొనసాగుతున్న క్రమంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ఓవైపు విజయవాడను వరదలు ముంచెత్తి అనేక ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలి పునరావస కేంద్రాలకు తరలి వెళ్లి ఇబ్బందులు పడుతుంటే టిడిపి, వైసిపి శ్రేణులు కృష్ణలంక వద్ద నిర్మించిన రిటైనింగ్ వాల్ వ్యవహారంపైన సోషల్ మీడియా వేదికగా తిట్టిపోసుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణలంక, రామలింగేశ్వనగర్ తదితర ప్రాంతాలు వరద ముంపు నుంచి బయటపడ్డాయి.
ఈ రిటైనింగ్వాల్ ఘనత తమదేనని చెప్పుకునేందుకు వైసీపీ నానా అవస్థలు పడుతోంది. వాస్తవానికి కరకట్ట గోడను టీడీపీ హయాంలోనే సగానికిపైగా పూర్తి చేశారు. మొత్తం 4.7 కిలోమీటర్ల వాల్ నిర్మాణం మూడు ఫేజ్లలో నిర్మాణం చేయాల్సి ఉంది. మొదటి ఫేజ్ 2.37 కి.మీ. యనమలకుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు రూ.165 కోట్లు, రెండో ఫేజ్ 1.23 కి.మీ. గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు రూ.126 కోట్లు, మూడో ఫేజ్ 1.01 కి.మీ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు రూ.110 కోట్లతో టీడీపీ హయాంలో 2016లోనే అంచనాలు తయారు చేయించారు. అయితే వైసీపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృష్ణలంక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని కృష్ణలంక వాసులు చెబుతున్నారని పోస్ట్ పెట్టింది.
AP Retaining Wall : వరదల సమయంలో రిటైనింగ్ వాల్పై రాజకీయ రగడ.. దాని ఘనత ఎవరిది?
ఇక ఈ పోస్టులపైన తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నారు. కృష్ణలంక వద్ద రిటైనింగ్ వాల్ 2019లో చంద్రబాబు హయాంలో నిర్మించబడిందని కృష్ణలంక ప్రజలకు మేలు చేసింది జగన్ కాదు చంద్రబాబు అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు అబద్ధాలు చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా నాడు చంద్రబాబు హయాంలో పూర్తయిన రిటైనింగ్ వాల్ విజువల్స్ పోస్ట్ పెట్టారు. మొత్తం మేమే చేశామని వైసీపీ చెబుతుంటే.. అరే బాబోయ్ చరిత్ర తెలుసుకోకపోతే ఎలా..? టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పడేస్తోంది. దీంతో ఈ వ్యవహారం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ అయ్యింది.
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
This website uses cookies.