Jio : బీఎస్ఎన్ఎల్ దెబ్బకి దిగొచ్చిన జియో.. సరసమైన ధరలకే ప్లాన్
Jio : జియో ఇటీవల రేట్లు పెంచడం మనం చూశాం. సడెన్గా ప్లాన్ ఆఫర్స్ పెంచడంతో వినియోగదారులు గగ్గోలు పెట్టారు. అయితే బీఎస్ఎన్ఎల్ జియోకి చెక్ పెట్టేలా ఆఫర్స్ ప్రకటిస్తుండడంతో జియో దిగి రాక తప్పడం లేదు. నష్ట నివారణ చర్యగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త వ్యాల్యూ యాడెడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది.అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే ఆఫర్లను జియో ఆవిష్కరించింది. సాధారణంగా కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ రేట్లు కనీసం రూ.180 నుంచి రూ.200 మధ్య ఉంటాయి. అయితే నెలకు రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్ను జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్లో కస్టమర్లు దేశంలో ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 3600 ఉచిత మెసేజులు, జియో అనుబంధ యాప్ల యాక్సెస్తో పాటు అదనంగా 24 జీబీల హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. సాధారణంగా కాల్స్, డేటా బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ రేట్లు కనీసం రూ.180 నుంచి 200 మధ్య ఉంటాయి.అయితే నెలకు కేవలం రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్ ని జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 336 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ తో కస్టమర్లు దేశంలోని ఏ నెట్వర్క్ కి అయినా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ తో అదనంగా 24 జీబీ ల హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది.
Jio : బీఎస్ఎన్ఎల్ దెబ్బకి దిగొచ్చిన జియో.. సరసమైన ధరలకే ప్లాన్
ఇక ఏడాది కాకుండా కేవలం నెలవారి ప్లాన్ ని పొందాలనుకుంటే రూ. 189 రీఛార్జ్ చేయించుకోవలసి ఉంటుంది. ఈ ప్లాన్ కి అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, నెలకు 300 ఉచిత ఎస్ఎంఎస్ లతో పాటు 2 జీబీ డేటా కూడా పొందవచ్చు. వినియోగదారులు జియోటీవీ, జీయో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో అనుబంధ యాప్ల సర్వీసులు పొందవచ్చు.టెలికాం రంగంలో పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. ఇతర కంపెనీలపై పై చేయి సాధించేందుకు ఒకదానికి మించి మరొకటి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మన దేశంలో జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ టెలికాం సేవలను అందిస్తున్నాయి
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…
Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…
Telangana : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…
This website uses cookies.