Ambati Rambabu : మాజీ మంత్రి పై కేసు నమోదు.. కేసులకు నేను భయపడాలా.. అంబటి రాంబాబు..!
ప్రధానాంశాలు:
Ambati Rambabu : మాజీ మంత్రి పై కేసు నమోదు.. కేసులకు నేను భయపడాలా.. అంబటి రాంబాబు..!
Ambati Rambabu : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బుధవారం గుంటూరులో జరిగిన వైసీపీ నిరసన కార్యక్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆయనపై బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద కేసు నమోదైంది. పోలీసుల విధుల్లో ఆటంకం కలిగించడమే కాకుండా, వారిని బెదిరించారని పేర్కొంటూ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదైనట్టు సమాచారం.

Ambati Rambabu : మాజీ మంత్రి పై కేసు నమోదు.. కేసులకు నేను భయపడాలా.. అంబటి రాంబాబు..!
Ambati Rambabu అంబటి రాంబాబు పై కేసు నమోదు..జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనా..?
సిద్ధార్థనగర్లోని తన నివాసం నుంచి అనుచరులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా బయలుదేరిన అంబటిని, పోలీసులు ముందుగా కలెక్టరేట్ వద్ద అడ్డుకున్నారు. అయినా వారు కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వరకు ప్రదర్శన నిర్వహించారు. అక్కడ మరోసారి పోలీసులు అడ్డుకోవడంతో అంబటి రాంబాబు తీవ్ర అసహనానికి లోనై, అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వివరణ ఇచ్చినా, అంబటి మండిపడి “ఎలా పోనివ్వరో చూస్తా” అంటూ సీఐపై దూషణలకు దిగారు.
ఈ వ్యవహారంలో సీఐపై మాటల దాడి చేసినట్టు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. సీఐ వెంకటేశ్వర్లు “మర్యాదగా మాట్లాడండి” అని హెచ్చరించినా, అంబటి మాట మానలేదని అంటున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసు విధులకు అడ్డంకిగా వ్యవహరించారని గుర్తించి, భారత న్యాయ వ్యవస్థ నూతనంగా అమలులోకి తీసుకొచ్చిన BNS (Bharatiya Nyaya Sanhita) 2023లోని సెక్షన్ 353 కింద కేసు నమోదైంది. ఈ పరిణామాలు వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి.