Home » Andhra Pradesh » Balineni Srinivasa Reddy Balineni Praneeth Reddy And 26 Corporators Join Janasena
andhra pradesh

Balineni Srinivasa Reddy : చంద్ర‌బాబు స‌న్నిహితుల‌ను వ‌ద‌ల‌ని బాలినేని!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: February 26, 2025, 9:00 pm
Advertisement

Balineni Srinivas Reddy : వైఎస్ఆర్సీపీకి పెద్ద షాక్ ఇస్తూ, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఒంగోలు నుండి 26 మంది కార్పొరేటర్లు అధికారికంగా జనసేనలో చేరారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ కూడా ఈ కార్యక్రమంలో పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ కొత్త సభ్యులను పార్టీలోకి స్వాగతించారు. గతంలో, వైఎస్ఆర్సీపీకి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో 43 మంది సభ్యులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య కేవలం నాలుగుకు చేరుకుంది. లాస్ ఫిరాయింపు సమయంలో, మేయర్, డిప్యూటీ మేయర్ మరియు 19 మంది ఇతర కార్పొరేటర్లు జనసేనలో చేరారు. తిరుపతిలో కూడా, పార్టీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు నాయకత్వంలో పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు జనసేనకు తమ విధేయతను వదులుకున్నారు.

Advertisement

Balineni Srinivasa Reddy : చంద్ర‌బాబు స‌న్నిహితుల‌ను వ‌ద‌ల‌ని బాలినేని!

Balineni Srinivasa Reddy చక్రం తిప్పుతున్న బాలినేని

అసెంబ్లీ ఎన్నికల అనంతరం మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాం రాం చెప్పేసి జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేని ఇప్పుడు ఆ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తున్నారు. బాలినేని సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశంలో జనసేనను బలమైన రాజకీయ శక్తిలా తీర్చిదిద్దేందుకు పావులు కదుపుతుండటం, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులను కూడా జనసేనలో చేర్చుకునే దిశగా ఆయన అడుగులు వేస్తుండటం ఇంట్రస్టింగ్ అంటున్నారు.

Advertisement

ప్రధానంగా వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని ఎవరినీ వదలడం లేదని చెబుతున్నారు. మంగళవారం ఒంగోలు కార్పొరేషన్ కు చెందిన 20 మంది కార్పొరేటర్లను జనసేనలో చేర్పించిన ఆయన ఇప్పుడు తన ఫోకస్ ను పెద్ద లీడర్లపై పెట్టారంటున్నారు. ప్రధానంగా దర్శి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును జనసేనలోకి తెచ్చేందుకు బాలినేని చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశమవుతున్నాయి. 2014లో దర్శి నుంచి టీడీపీ తరఫున గెలిచి మంత్రి పదవి నిర్వహించిన శిద్దా రాఘవరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. ఆయనపై ఫోకస్ చేసిన బాలినేని.. జనసేనలోకి శిద్ధాను తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆయన చేరికపై ఆసక్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీలో శిద్ధా రాఘవరావు గ్లాసును అందుకుంటారని అంటున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి