
Balineni Srinivasa Reddy : చంద్రబాబు సన్నిహితులను వదలని బాలినేని!
Balineni Srinivas Reddy : వైఎస్ఆర్సీపీకి పెద్ద షాక్ ఇస్తూ, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఒంగోలు నుండి 26 మంది కార్పొరేటర్లు అధికారికంగా జనసేనలో చేరారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ కూడా ఈ కార్యక్రమంలో పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ కొత్త సభ్యులను పార్టీలోకి స్వాగతించారు. గతంలో, వైఎస్ఆర్సీపీకి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో 43 మంది సభ్యులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య కేవలం నాలుగుకు చేరుకుంది. లాస్ ఫిరాయింపు సమయంలో, మేయర్, డిప్యూటీ మేయర్ మరియు 19 మంది ఇతర కార్పొరేటర్లు జనసేనలో చేరారు. తిరుపతిలో కూడా, పార్టీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు నాయకత్వంలో పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు జనసేనకు తమ విధేయతను వదులుకున్నారు.
Balineni Srinivasa Reddy : చంద్రబాబు సన్నిహితులను వదలని బాలినేని!
అసెంబ్లీ ఎన్నికల అనంతరం మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాం రాం చెప్పేసి జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేని ఇప్పుడు ఆ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తున్నారు. బాలినేని సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశంలో జనసేనను బలమైన రాజకీయ శక్తిలా తీర్చిదిద్దేందుకు పావులు కదుపుతుండటం, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులను కూడా జనసేనలో చేర్చుకునే దిశగా ఆయన అడుగులు వేస్తుండటం ఇంట్రస్టింగ్ అంటున్నారు.
ప్రధానంగా వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని ఎవరినీ వదలడం లేదని చెబుతున్నారు. మంగళవారం ఒంగోలు కార్పొరేషన్ కు చెందిన 20 మంది కార్పొరేటర్లను జనసేనలో చేర్పించిన ఆయన ఇప్పుడు తన ఫోకస్ ను పెద్ద లీడర్లపై పెట్టారంటున్నారు. ప్రధానంగా దర్శి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును జనసేనలోకి తెచ్చేందుకు బాలినేని చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశమవుతున్నాయి. 2014లో దర్శి నుంచి టీడీపీ తరఫున గెలిచి మంత్రి పదవి నిర్వహించిన శిద్దా రాఘవరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. ఆయనపై ఫోకస్ చేసిన బాలినేని.. జనసేనలోకి శిద్ధాను తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆయన చేరికపై ఆసక్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీలో శిద్ధా రాఘవరావు గ్లాసును అందుకుంటారని అంటున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
This website uses cookies.