Categories: andhra pradeshNews

Balineni Srinivasa Reddy : చంద్ర‌బాబు స‌న్నిహితుల‌ను వ‌ద‌ల‌ని బాలినేని!

Advertisement
Advertisement

Balineni Srinivas Reddy : వైఎస్ఆర్సీపీకి పెద్ద షాక్ ఇస్తూ, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఒంగోలు నుండి 26 మంది కార్పొరేటర్లు అధికారికంగా జనసేనలో చేరారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ కూడా ఈ కార్యక్రమంలో పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ కొత్త సభ్యులను పార్టీలోకి స్వాగతించారు. గతంలో, వైఎస్ఆర్సీపీకి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో 43 మంది సభ్యులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య కేవలం నాలుగుకు చేరుకుంది. లాస్ ఫిరాయింపు సమయంలో, మేయర్, డిప్యూటీ మేయర్ మరియు 19 మంది ఇతర కార్పొరేటర్లు జనసేనలో చేరారు. తిరుపతిలో కూడా, పార్టీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు నాయకత్వంలో పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు జనసేనకు తమ విధేయతను వదులుకున్నారు.

Advertisement

Balineni Srinivasa Reddy : చంద్ర‌బాబు స‌న్నిహితుల‌ను వ‌ద‌ల‌ని బాలినేని!

Balineni Srinivasa Reddy చక్రం తిప్పుతున్న బాలినేని

అసెంబ్లీ ఎన్నికల అనంతరం మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాం రాం చెప్పేసి జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేని ఇప్పుడు ఆ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తున్నారు. బాలినేని సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశంలో జనసేనను బలమైన రాజకీయ శక్తిలా తీర్చిదిద్దేందుకు పావులు కదుపుతుండటం, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులను కూడా జనసేనలో చేర్చుకునే దిశగా ఆయన అడుగులు వేస్తుండటం ఇంట్రస్టింగ్ అంటున్నారు.

Advertisement

ప్రధానంగా వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని ఎవరినీ వదలడం లేదని చెబుతున్నారు. మంగళవారం ఒంగోలు కార్పొరేషన్ కు చెందిన 20 మంది కార్పొరేటర్లను జనసేనలో చేర్పించిన ఆయన ఇప్పుడు తన ఫోకస్ ను పెద్ద లీడర్లపై పెట్టారంటున్నారు. ప్రధానంగా దర్శి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును జనసేనలోకి తెచ్చేందుకు బాలినేని చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశమవుతున్నాయి. 2014లో దర్శి నుంచి టీడీపీ తరఫున గెలిచి మంత్రి పదవి నిర్వహించిన శిద్దా రాఘవరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. ఆయనపై ఫోకస్ చేసిన బాలినేని.. జనసేనలోకి శిద్ధాను తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆయన చేరికపై ఆసక్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీలో శిద్ధా రాఘవరావు గ్లాసును అందుకుంటారని అంటున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Advertisement

Recent Posts

Koppula Narasimha Reddy : డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం : కొప్పుల నర్సింహ్మా రెడ్డి

Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…

3 hours ago

Mahesh Kumar Goud : ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి : మ‌హేష్‌కుమార్‌ గౌడ్‌

Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న అందిస్తుంద‌ని పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ‌మే…

4 hours ago

Lady Aghori : మమ్మల్ని వదిలేయకపోతే మీము ప్రాణాలు తీసుకుంటాం : అఘోరి , వర్షిణి

Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…

5 hours ago

Divi Vadthya : వామ్మో.. దివి అందాల‌తో తెగ మ‌త్తెక్కిస్తుందిగా.. మాములు అరాచ‌కం కాదు ఇది..!

Divi Vadthya : బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్‌కు చెందిన…

6 hours ago

UPI పేమెంట్స్ చేసేవారికి షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..!

UPI  : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్‌ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…

7 hours ago

Ponguleti Srinivasa Reddy : ఇందిరమ్మ ఇళ్ల పై పొంగులేటి కీల‌క అప్‌డేట్‌..!

Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…

8 hours ago

GPO Posts : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. జీపీవో పోస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…

9 hours ago

Janhvi Kapoor : టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి క్రేజ్ మాములుగా లేదుగా..!

Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…

10 hours ago