Vijayawada : రాజకీయంగా అత్యంత కీలకమైన నగరం విజయవాడ. ఇక్కడ ఒకప్పుడు కమ్యూనిస్టులు, తర్వాత.. కాంగ్రెస్ రాజకీయంగా రాజ్యమేలాయి. ఇక్కడ ఆ పార్టీల్లో ఉన్న నేతలే కారణం. కమ్యూనిస్టు, కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యతతోనే ఇక్కడ వారికి పట్టు చిక్కింది. టీడీపీ 1994, 1999లో అధికారంలో ఉన్నా కూడా విజయవాడ నగరంలో ఆ పార్టీని శాసించే నాయకులు లేరు. అయితే 2014 తర్వాత మాత్రమే టీడీపీ కూడా ఇక్కడ పుంజుకుంది.
రెండు అసెంబ్లీ.. ఒక పార్లమెంటు స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే.. ఇప్పుడు బెజవాడ టీడీపీలో నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇప్పుడు మూడు ముక్కలు అయ్యి.. చీలికలు పీలికలు అయిపోయింది. ఈ గ్యాప్ను తమకు అనుకూలంగా మార్చుకుని పుంజుకోవాల్సిన వైసీపీ నాయకులు కూడా ఇదే పద్ధతిలో ముందుకు సాగుతున్నారని టాక్ వినిపిస్తోంది. బెజవాడ వైసీపీలో ఎందరో కీలక నేతలు ఉన్నా ఎవరూ కూడా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడం లేదు. ఎవరికివారుగానే రాజకీయాలు చేసుకుంటూ తమతమ వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడలోని సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి.
దూకుడు మీదున్నా..
అదే సమయంలో తూర్పులో యువ నాయకుడు దేవినేని అవినాష్ దూకుడుగా ఉన్నారు.. అయితే.. పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న వెలంపల్లి శ్రీనివాస్ మంత్రి అయినప్పటికీ వెల్లంపల్లికి, సెంట్రల్ ఎమ్మెల్యేకు మధ్య పొసగడం లేదని అంటున్నారు. ఇక, నగర పార్టీ ఇంచార్జ్గా ఉన్న బొప్పన భవకుమార్ను ఎవరూ లెక్క చేయడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించడం.జగన్ దగ్గర పలుకుబడి కోసం తహతహలాడడంతోనే కాలం గడిపేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఎక్కడికక్కడ గ్రూపులు, వర్గాలతో సతమతం అవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ పుంజుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. బలమైన నేత వెస్ట్ లో ఉంటే, వెలంపల్లికి బ్రేక్ పడుతుందని అంచనా వెల్లువెత్తుతోంది. ఈ స్థానంపై జనసేన కన్నేసిందని, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని దింపనుందని టాక్ వినిపిస్తోంది. ఇంత జరుగుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం పుంజుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జగన్ దృష్టి పెడితే గానీ, కొలిక్కి రాదని కేడర్ చర్చించుకుంటోంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.