Bhuma Akhila Priya : వైసీపీ నేతలు మీరు నిరూపించండి నేను రాజీనామా చేస్తా : అఖిలప్రియ సవాల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhuma Akhila Priya : వైసీపీ నేతలు మీరు నిరూపించండి నేను రాజీనామా చేస్తా : అఖిలప్రియ సవాల్

 Authored By ramu | The Telugu News | Updated on :3 May 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Bhuma Akhila Priya : వైసీపీ నేతలు మీరు నిరూపించండి నేను రాజీనామా చేస్తా : అఖిలప్రియ సవాల్

Bhuma Akhila Priya : ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాజాగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహోబిలంలో తాను అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు నిరూపిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తాను ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లో లేనని, వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమని, వైసీపీ నేతలు దమ్ముంటే చర్చలకు రావాలని ఆమె సవాల్ విసిరారు.

Bhuma Akhila Priya వైసీపీ నేతలు మీరు నిరూపించండి నేను రాజీనామా చేస్తా అఖిలప్రియ సవాల్

Bhuma Akhila Priya : వైసీపీ నేతలు మీరు నిరూపించండి నేను రాజీనామా చేస్తా : అఖిలప్రియ సవాల్

Bhuma Akhila Priya : భూమా అఖిలప్రియ సవాల్ కు వైసీపీ నేతలు సిద్ధమా..?

అహోబిలంలో జరుగుతున్న నిర్మాణాలపై స్పందించిన అఖిలప్రియ, ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు జరిగితే వాటిని కూల్చివేస్తామని చెప్పారు. కన్ స్ట్రక్షన్‌కు పంచాయతీ తీర్మానం అవసరమని, అప్పట్లో సర్పంచ్‌గా వైసీపీకి చెందిన నేత ఉండగా ఇలాంటి అక్రమాలు ఎలా జరిగాయో వివరించాలన్నారు. వైసీపీ హయాంలోనే చాలా అక్రమ నిర్మాణాలు జరిగాయని, ఇప్పుడు అవి సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నామన్నారు. కానీ తమ చర్యలు మింగుడుపడకే వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ నాయకులు అబద్ధాలు మాట్లాడటం పరిపాటిగా మార్చుకున్నారని అఖిలప్రియ ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం వైసీపీ చేస్తున్న అప్రచారాన్ని తాము తిప్పికొడతామని, నిజాలను ప్రజలకు వెల్లడించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు .

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది