Ys Jagan : జగన్ పాలనలో విపరీతంగా పెరిగిన పెట్టుబడులు…స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం…!

Advertisement
Advertisement

Ys Jagan : 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు తీసుకురాలేదు.. పరిశ్రమలు తీసుకురాలేదు..ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అనేవారికి దిమ్మతిరిగే సమాధానం తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పాలనతో పోల్చి చూసినట్లయితే జగన్ పాలనలో పెట్టుబడులు మూడింతలు పెరిగాయని వెల్లడించింది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అనే లక్ష్యాలకు కట్టుబడి ఉన్నారు.ఎందుకంటే ఒకవైపు నవరత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే..ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పాలి.ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అంబానీ, ఆదాని , బిర్లా వంటి కొన్ని టాప్ కంపెనీలు ఆంధ్రాలో పరిశ్రమలు ప్రారంభించడానికి ముందడుగులు వేస్తున్నాయి. ఇక ఈ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని చెప్పాలి.అయితే జగన్ పాలనలో ఏపీ సంక్షేమం మరియు అభివృద్ధి దిశగా సాగుతున్న విపక్ష పార్టీలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నాయి.

Advertisement

కేవలం పథకాలను చూపిస్తూ జనాలను మభ్యపెడుతున్నారని రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించడం లేదని పెట్టుబడులు రావడంలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అలా విమర్శించే వారందరికీ గట్టి షాక్ తగిలింది.తాజాగా చంద్రబాబు పాలనలో కన్నా జగన్ హయాంలోనే ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని ఇక ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే…చంద్రబాబు పాలనతో పోల్చి చూస్తే గడిచిన నాలుగున్నర ఏళ్లలో జగన్ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుండి రాష్ట్రంలో పెట్టుబడులు మూడింతలు పెరిగాయి.ఇక ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ( డీపీఐఐటీ ) ,వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు పాలనలో 2014 -18 కాలంలో వచ్చిన పెట్టుబడులతో పోల్చి చూస్తే 2019-23 జూన్ వరకు అంటే వైయస్ జగన్ పాలన లో దాదాపు 226.9% పెట్టుబడులు అధికంగా వచ్చాయట. ఇక 2014 -18 క్యాలెండర్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పరిశ్రమలు పెట్టుబడులు కేవలం రూ.32,803 కోట్లు మాత్రమే.

Advertisement

కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు రూ.1,00,103 , కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలో వచ్చాయట. అంతేకాక చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సు పేరుతో ప్రతి సంవత్సరం హడావిడి చేసి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి అంటూ చేసిన ప్రచారాలు వాస్తవం కాదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ జగన్ ఐదేళ్ల పాలనలో వాస్తవ రూపం దాల్చిన , ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల పెట్టుబడులే లక్షల కోట్లకు పైగా ఉన్నాయట.కానీ వీటి గురించి ఎన్నడూ జగన్ ప్రచారాలు కానీ ఆర్భాటాలు కానీ చేసుకోలేదు. అంతేకాక వాస్తవానికి దేశంలో జరిగే పెట్టుబడుల సదస్సులో జరిగే ఒప్పందాలు అన్నీ కూడా 16 నుంచి 17% మాత్రమే వాస్తవం రూపం లో ఉంటాయట. కానీ జగన్ పాలనలో అవన్నీ భిన్నంగా కనిపిస్తున్నాయి.ఎందుకంటే విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఏడాది పూర్తి కాకుండానే దాదాపు 19% పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయని ఈ గణంకాలు తెలియజేశారు. ఇలా జిఐఎస్ లో మొత్తం 13.11 లక్షలు కోట్లు విలువైన 386 ఒప్పందాలు జరగగా 2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమ పనులు వేరువేరు దశలో ఉన్నాయని సమాచారం.ఇది అంతా కూడా వైయస్ జగన్ ప్రభుత్వ కృషికి నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇన్నేళ్లుగా పరిశ్రమలు రాలేదు , పెట్టుబడులు రాలేదు అని విమర్శించిన విపక్షాలు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

21 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.