Chandra Babu Naidu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తీర్థయాత్రలలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తిరుమల శ్రీవారిని , విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు ఈరోజు ఉదయం సింహాచలా అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి దక్కని గౌరవం నాకు లభించింది. 70, 80 దేశాలలో నాకోసం రోడ్డుమీదికి వచ్చి నిరసనకు దిగారు. తెలుగు రాష్ట్రాలలో విరోచితంగా మాట్లాడారు. దేశమంతా కూడా పోరాడారు ఎక్కడికక్కడ పూజలుమ, ఆందోళనలు చేశారు. నిరసనలు చేశారు. వారు చూపిన సంఘీభావం నేను ఎప్పటికీ మర్చిపోను. నా జీవితం చరితార్థం అయింది. అదే సమయంలో నాకు బాధ్యత ఉంది. మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడి ఈ జనాలను కాపాడే శక్తి సామర్థ్యాలు నాకు ఇవ్వమని నరసింహ స్వామిని కోరుకుంటున్నాను అని అన్నారు.
తనను ఈరోజు ఎంతగా అభిమానిస్తున్నారో, ఆశిస్తున్నారో అందరూ కూడా కలిసి ముందుకు నడవాలి. భావితరాల భవిష్యత్తును కూడా ఆలోచించాలి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ ఎన్నికలు గురించి చెప్పండి అని రిపోర్టర్ అడగగా ఇక్కడ రాజకీయాలు మాట్లాడను అని ఆయన చెప్పారు. ఇక టిడిపి అధికారంలోకి రాగానే పంచ గ్రామాల భూములను సమస్యలను పరిష్కరిస్తాం అని అన్నారు. ధర్మక్షేత్రంలో రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు రాజకీయం గురించి మాట్లాడాలంటే విమర్శలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాట్లాడాను. రాష్ట్రంలో ధర్మం నీతి లేదు ధర్మ పరిరక్షణ కోసం నరసింహ స్వామి దర్శించుకున్నాను అని ఆయన అన్నారు.
కష్టాల్లో ఉన్నప్పుడు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగి నా కోసం వేడుకున్నారు. ఇవన్నీ ధర్మాన్ని కాపాడడానికే కదా అని అన్నారు. ఇక ఈరోజు సింహాచలం అప్పన్న దర్శించుకున్న చంద్రబాబు ఈ నెల 5 న శ్రీశైలం మల్లన్నను దర్శించుకోబోతున్నారు. ఈ తీర్థయాత్రలు ముగిసాగా పూర్తిగా రాజకీయా కార్యక్రమాల్లో పాల్గొంటారని టిడిపి నేతలు తెలిపారు. వాస్తవానికి చంద్రబాబు బెయిల్ వచ్చిన అనంతరం శ్రీవారి దర్శనానికి వెళతారు అనుకున్నారు. కానీ అప్పుడు సాధ్యపడకపోవడంతో ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో చంద్రబాబు తీర్థయాత్రలు ప్రారంభించారు. పొలిటికల్ యాత్రలు ప్రారంభించే ముందుగా ఆయన అందరి దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు అని తెలుస్తుంది.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.