Chandrababu : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, అమరావతి పేరు తోపాటు, కేబినెట్ పలు నిర్ణయాలు..!
ప్రధానాంశాలు:
Chandrababu : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, అమరావతి పేరు తోపాటు, కేబినెట్ పలు నిర్ణయాలు..!
Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. భేటిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్కు ఏపీ కేబినెట్ అభినందలు తెలియజేసింది. PM Modi ప్రధాని , భారత సైన్యాని కి అండగా ఉండాలని నిర్ణయించింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి అని పెట్టాలని మంత్రి మండలి కోరింది.

Chandrababu : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, అమరావతి పేరు తోపాటు, కేబినెట్ పలు నిర్ణయాలు..!
Chandrababu కీలక అంశాలు..
ఏపీ పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి అని పెట్టాలని మంత్రి మండలి కేంద్రాన్ని కోరింది. దీని వలన అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని కేబినెట్ పేర్కొంది.క్యాపిటల్ అమరావతిని ఫ్రీ జోన్గా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.2014 పునర్విభజన చట్టంలో రాజధాని అమరాతి అని లేదని.. ఒకసారి పునర్విభజన చట్టంలో రాజధాని అమరావతి అని నిర్ణయిస్తే రాజధానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుందని పలువురు న్యాయనిపుణులతో పాటు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసిన రైతులు కూడా సూచించారు.
2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు తమ విధానమని ముందుకు వెళ్లడంతో 2019 నుంచి 2024 వరకు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగింది.అమరావతి ఏకైక రాజధాని విధానంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి నిర్మాణ పనులను రీలాంచ్ చేసింది. దీని వలన అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని కేబినెట్ పేర్కొంది.