Central Govt : పోయిన కేంద్ర ప్రభుత్వ పరువు ని కాపాడే బిల్ ఇదే ?
Central Govt ,దేశవ్యాప్తంగా పేపర్ లీక్లు, పరీక్షల మాల్ప్రాక్టీస్కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను లోక్సభలో ప్రవేశపెడుతోంది. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా వంటి కఠిన నిబంధనలతో ఈ బిల్లు తీసుకొస్తున్న మార్పుల..
Central Govt : దేశంలో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, ఇతర పోటీ పరీక్షల్లో వరుసగా వెలుగులోకి వస్తున్న పేపర్ లీక్లు, మాల్ప్రాక్టీస్ ఘటనలు లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. పరీక్షలపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినడం, పరీక్షలను మళ్లీ నిర్వహించాల్సిన పరిస్థితులు రావడం, ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తడం వంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఈ బిల్లును సోమవారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టనున్నారు.ఈ బిల్లు ముసాయిదా ఇప్పటికే అన్ని పార్టీల ఎంపీలకు అందింది. విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఈ బిల్లుపై చర్చ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు అవసరమైతే సవరణలను కూడా సూచించే అవకాశం ఉంది.కేంద్రం అభిప్రాయం ప్రకారం, కఠిన చట్టాలు లేకపోవడం వల్ల పేపర్ లీక్ మాఫియాలు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయి. అందుకే 2024లో అమల్లోకి వచ్చిన చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ కొత్త సవరణలను తీసుకొస్తోంది.
Central Govt : పోయిన కేంద్ర ప్రభుత్వ పరువు ని కాపాడే బిల్ ఇదే ?
Central Govt 10 ఏళ్ల జైలు నుంచి రూ.10 కోట్ల జరిమానా వరకు.. కొత్త బిల్లులో కీలక మార్పులివే
ఈ సవరణ బిల్లు అమల్లోకి వస్తే పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలు, మాఫియా ముఠాలపై ఇప్పటివరకు ఉన్నదానికంటే చాలా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం పేపర్ లీక్ లేదా మాల్ప్రాక్టీస్కు పాల్పడిన వారికి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. కొత్త బిల్లులో దీనిని ఐదు నుంచి పది సంవత్సరాలకు పెంచాలని ప్రతిపాదించారు. అలాగే వ్యక్తిగతంగా విధించే జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెంచాలని నిర్ణయించారు. దీంతో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులు భారీ ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యమయ్యే సంస్థలు, కోచింగ్ సెంటర్లు లేదా వాటి డైరెక్టర్లు ఉద్దేశపూర్వకంగా అక్రమాలకు పాల్పడితే కనీస జైలు శిక్షను మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు పెంచనున్నారు. వీరిపై విధించే వ్యక్తిగత జరిమానాను రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల వరకు పెంచే ప్రతిపాదన కూడా బిల్లులో ఉంది. ఇక వ్యవస్థీకృతంగా పేపర్ లీక్లకు పాల్పడే ముఠాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ తరహా ఆర్గనైజ్డ్ క్రైమ్లకు కనీసం ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా బిల్లులో నిబంధనలు చేర్చింది.ఈ బిల్లుపై లోక్సభలో చర్చ అనంతరం సభ్యులు సూచనలు చేస్తారు. అవసరమైతే కొన్ని మార్పులు చేసి తుది రూపం ఇవ్వనున్నారు. అనంతరం సభ ఆమోదం లభిస్తే చట్టంగా అమల్లోకి వస్తుంది. విద్యా రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చట్టం అమల్లోకి వస్తే పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరగడమే కాకుండా, నిజాయితీగా సిద్ధమవుతున్న లక్షలాది మంది అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. పేపర్ లీక్ మాఫియాపై భయం పెరిగి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు గణనీయంగా తగ్గే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.







