Chandrababu : డ్వాక్రా మహిళలకు చంద్రన్న గుడ్ న్యూస్..!
Chandrababu : ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం విద్యా పరంగా కొత్త ప్రయోజనాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం పాలనలో ఏడాది పూర్తవుతుండగా, పలు ప్రజాప్రయోజన నిర్ణయాల్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డ్వాక్రా మహిళల పిల్లల చదువులను ప్రోత్సహించడానికి ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకి విద్యారుణాలు అందించనున్నారు.
Chandrababu : డ్వాక్రా మహిళలకు చంద్రన్న గుడ్ న్యూస్..!
ఈ పథకానికి ఏటా రూ.200 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా డ్వాక్రా మహిళలకు కేవలం 4% వడ్డీకే రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకూ విద్యారుణం లభించనుంది. ఈ రుణం కేజీ నుండి పీజీ వరకు పిల్లల చదువులకు ఉపయోగపడేలా రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఇది వర్తించనుంది. ఫీజులు, పుస్తకాలు, యూనిఫారమ్లు, సైకిళ్లు, సాంకేతిక విద్య సామగ్రి వంటి అవసరాలకు ఈ నిధులను వినియోగించవచ్చునని అధికారులు తెలిపారు.
ఈ పథకాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. రుణం తీసుకున్న తర్వాత అది విద్య అవసరాలకే వినియోగించారన్న రుజువుగా సంబంధిత రశీదులను స్త్రీనిధికి సమర్పించాల్సి ఉంటుంది. రుణ మొత్తాన్ని 24 నుంచి 36 నెలల మధ్యలో వాయిదాల రూపంలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించనున్నారు. విద్య ద్వారా కుటుంబ అభివృద్ధి సాధించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకానికి త్వరలోనే ప్రభుత్వ గెజిట్లో ప్రకటన వెలువడనుంది.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.