Chandrababu : చంద్రబాబు సరికొత్త నిర్ణయం.. జగన్ తెచ్చిన జీఓని పక్కన పడేయడంతో అందరు హర్షం..!
Chandrababu : కూటమి ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలు పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-117ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది. స్కూళ్లలో తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు, టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్ లాంటి వాటిని అమలు చేసేందుకు ఈ జీవోను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ జీవోను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని రద్దు చేసి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అధికారులు చర్చలు జరిపారు.
ప్రతి మేజర్ పంచాయతీలో ఒక మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని డైరెక్టర్ విజయరామరాజు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన నియమాలపై ఉపాధ్యయ సంఘాలతో చర్చించారు. 3, 4, 5 తరగతులను గత ప్రభుత్వంలో విలీనం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిగే ఇబ్బందులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మేజర్ పంచాయతీలోనూ ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాప్లను వీలైనంత వరకు సులభంగా ఉండేలా, ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు.
Chandrababu : చంద్రబాబు సరికొత్త నిర్ణయం.. జగన్ తెచ్చిన జీఓని పక్కన పడేయడంతో అందరు హర్షం..!
మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తోందని.. హామీల అమలు ఏమైందంటూ వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల సమయంలో చిన్నపిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, నిరుద్యోగ యువతకు, రైతులకు ఇలా అందరికీ హామీలు ఇచ్చారని.. ఇప్పుడం ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అదే తాము అధికారంలో ఉండి ఉంటే.. ఇప్పటికే రైతుభరోసా, చేయూత, అమ్మ ఒడి ఇలా.. అన్ని పథకాలు ఇప్పటికే అమలు చేసి ఉండేవారమని చెప్తున్నారు. టీడీపీ కూటమి సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని.. సూపర్ సిక్స్ కాదు అవుట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు
Redmi Note 14 : ఈ ఏడాది విడుదలైన రెడ్మి నోట్ 14 ప్రో స్మార్ట్ఫోన్ ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్కార్ట్…
Manchu Vishnu : మంచు విష్ణు Manchu Vishnu హీరోగా నటిస్తున్న 'కన్నప్ప' Kannappa Movie మూవీ జూన్ 27న…
Chandrababu : తెలుగు దేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణకు…
Child : ప్రస్తుతం తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఉన్నత విద్య, మంచి స్థిరమైన భవిష్యత్తు, వివాహ ఖర్చులు వంటి ఎన్నో…
Bangalore Stampede : ఐపీఎల్ 2025 సీజన్ విజయం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేపట్టిన విక్టరీ పరేడ్లో అపశృతి…
Roja : వైసీపీ ఆధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి ఆర్కే రోజా చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్న…
Police : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధ రైతు తన భూమి…
RCB 18 : విరాట్ కోహ్లీ కల నెరవేరింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి.. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు…
This website uses cookies.