
Chandrababu Naidu : మంత్రి పై చంద్రబాబు సీరియస్..!
Chandrababu Naidu : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులు, నాయకులు కూడా చాలా సీరియస్గా పని చేస్తున్నారు. ఎవరైన అలసత్వం ప్రదర్శిస్తే వార్నింగులు ఇస్తున్నారు AP CM ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ వ్యవహారాల్లోనే కాదు, పార్టీ వ్యవహారాల్లోనూ నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోనని తరచూ చెప్పే ఆయన ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్ఛార్జ్ నుంచి మంత్రి వరకు ఎవర్నీ వదలడం లేదు. చెప్పిన పని చెప్పినట్టుగా చేయాల్సిందేనంటూ క్లాస్ తీసుకుంటున్నారు. ఇలాంటి ఓ ఆడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురానికి చెందిన వారు కాగా, ఆయన వైసీపీలో ఒక సాధారణ కార్యకర్త. నాటి మంత్రి పినిపే విశ్వరూప్తో పొసగకపోవడంతో పార్టీకి దూరమయ్యారు.,,
ఎన్నికల ముందే Ysrcp వైసీపీలో నుంచి TDP టీడీపీలోకి మారి.. రామచంద్రపురం స్థానం సీటు పొందారు. నియోజకవర్గం కొత్తదైనా రాజకీయ దిగ్గజాలు ఉన్న నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే ఎన్నికైన కొన్నిరోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో కూడా స్థానం పొందారు. చంద్రబాబు మంత్రివర్గంలో కోనసీమ జిల్లా నుంచి స్థానం లభించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించిన యువనేతకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుందని జోరుగా చర్చ జరుగుతోంది.మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల సభ్యత్వలు నమోదు చేయించడంతో మంత్రి వెనుకబడి ఉన్నట్లు తెలుస్తొంది. ఇప్పటి వరకు కేవలం 29 శాతం మాత్రమే ఎమ్మెల్సీ ఓట్ల సభ్యత్వ నమోదు చేయించినట్లు సమాచారం. అయితే.. పట్ట భద్రుల ఎన్నికలకు సంబంధించి.. తొమ్మిది వేల మంది ఓట్ల నమోదుకు లక్ష్యంగా పెడితే కేవలం 2వేల 300 ఓట్లు మాత్రమే చేయడంతో సీఎం చంద్రబాబు నుంచి మంత్రి సుభాష్ చివాట్లు తిన్నట్టుగా తెలుస్తోంది.
Chandrababu Naidu : మంత్రి పై చంద్రబాబు సీరియస్..!
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మంత్రికి ఫోన్ చేసి చివాట్లు పెట్టినట్లు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యే అయిన కూడా మంత్రిగా గురుతర బాధ్యతలు అప్పగిస్తే.. ఇంత నెగ్లీజెన్సీగా ఉంటారా అని మండిపడినట్లు తెలుస్తొంది. ఇలా అయితే కుదరదని.. తాము మరో ప్రత్యామ్నాయం చూస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.మరోవైపు మంత్రి యువకుడు కావడంతో సీనియర్లకు గౌరవం ఇవ్వట్లేదని మరోవాదన వినిపిస్తుంది. అయితే నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను సుభాష్ దూరంపెట్టి అమలాపురం నుండి వచ్చిన తన సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయట. తనకు ఇచ్చిన శాఖపై పూర్తి అవగాహన లేకపోవడంతో ఆ శాఖ అధికారులు కూడా మంత్రి సుభాష్ ను తప్పుదోవ పట్టిస్తున్నారనే టాక్ నడుస్తుంది.
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
This website uses cookies.