Chandrababu : కేంద్రానికి క్లియర్ గా చెప్పిన బాబు.. ముందు క్యాపిటల్ ఆ తర్వాతే ఏదైనా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : కేంద్రానికి క్లియర్ గా చెప్పిన బాబు.. ముందు క్యాపిటల్ ఆ తర్వాతే ఏదైనా..!

Chandrababu : ఏపీ 2024 ఫలితాలు అక్కడి ప్రజల తీర్పు ఏంటన్నది అర్ధమైంది. గత ప్రభుత్వం కనీసం క్యాపిటల్ ని కూడా నిర్మించలేదు. మూడు క్యాపిటల్స్ అంటూ ఐదేళ్లు టైం పాస్ చేసింది. ఐతే క్యాపిటల్ విషయంలో చంద్రబాబు ముందునుంచి ఒకే మాట మీద ఉన్నారు. అమరావతి క్యాపిటల్ గా చేసి అభివృద్ధి చేయాలని ఆయన అనుకున్నారు కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి వల్ల అది కుదరలేదు.ఇక ఈసారి గెలిచిన తర్వాత మరోసారి క్యాపిటల్ గా […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Chandrababu : కేంద్రానికి క్లియర్ గా చెప్పిన బాబు.. ముందు క్యాపిటల్ ఆ తర్వాతే ఏదైనా..!

Chandrababu : ఏపీ 2024 ఫలితాలు అక్కడి ప్రజల తీర్పు ఏంటన్నది అర్ధమైంది. గత ప్రభుత్వం కనీసం క్యాపిటల్ ని కూడా నిర్మించలేదు. మూడు క్యాపిటల్స్ అంటూ ఐదేళ్లు టైం పాస్ చేసింది. ఐతే క్యాపిటల్ విషయంలో చంద్రబాబు ముందునుంచి ఒకే మాట మీద ఉన్నారు. అమరావతి క్యాపిటల్ గా చేసి అభివృద్ధి చేయాలని ఆయన అనుకున్నారు కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి వల్ల అది కుదరలేదు.ఇక ఈసారి గెలిచిన తర్వాత మరోసారి క్యాపిటల్ గా అమరావితినే డిక్లేర్ చేస్తూ బాబు పని చేస్తున్నారు. అంతేకాదు కేంద్రం నుంచి కూడా అమరావితికి కావాల్సిన సపోర్ట్ ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. పిఎం మోడీతో పాటు కేంద్ర మంత్రులతో ఆయక మీటింగ్స్ జరుపుతున్నారు.

Chandrababu అమరావతితో పాటు పోలవరం కూడా

ఏపీ అభివృద్ధే ముఖ్య లక్ష్యంగా బాబు కేంద్రం నుంచి పూర్తి సపోర్ట్ కావాలని అడుగుతున్నారు. అమరావతి విషయంలో కేంద్రం సహకారం కావాలని అడిగారట. దాదాపు కేంద్రం నుంచి కూడా పాజిటివ్ నోట్ వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు పోలవరం ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేసేలా నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రులతో బాబు చర్చించారట. గత ప్రభుత్వం చేసిన పనుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఏమాత్రం ముందుకు జరగలేదని. కేంద్రం సపోర్ట్ చేస్తే దాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చూస్తామని చంద్రబాబు చెప్పారట. అంతేకాదు ఏపీ డెవలప్ మెంట్ కి అన్నివిధాలుగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించేలా చర్చలు జరుపుతున్నారట. ఏపీ విషయంలో కేంద్రం కూడా ఈసారి అన్నిటికీ ఓకే అనేస్తుందని తెలుస్తుంది.

Chandrababu కేంద్రానికి క్లియర్ గా చెప్పిన బాబు ముందు క్యాపిటల్ ఆ తర్వాతే ఏదైనా

Chandrababu : కేంద్రానికి క్లియర్ గా చెప్పిన బాబు.. ముందు క్యాపిటల్ ఆ తర్వాతే ఏదైనా..!

ఏపీని రాబోయే రోజుల్లో మిగతా అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిచేలా బాబు పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అమరావతిని పర్ఫెక్ట్ క్యాపిటల్ గా పూర్తి చేయడం.. పోలవరం ప్రాజెక్ట్ ని ముగించడం తో ఏపీకి మంచి రోజులు వస్తాయని అంటున్నారు. ఐతే ఏపీ విషయంలో ఈసారి కేంద్రం కూడా అన్ని విషయాల్లో సానుకూలంగా స్పందిస్తుందని తెలుస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది