
Chandrababu : ఏపీ ప్రజలకు చంద్రబాబు మరో గుడ్న్యూస్..!
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో ముఖ్యమంత్రి CM చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాట్ ధరలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడంతో మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక భాద్యతను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై భారీగా రాయితీ ప్రకటించడం ప్రజలకు ఊరటనిస్తుంది. ఇదివరకు ప్లాట్ మొత్తం విలువపై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయబడింది. ఇది మధ్యతరగతికి భారంగా మారిన నేపథ్యంతో ఇప్పుడు ప్రభుత్వం రెండు విడతల మోడల్ను ప్రవేశపెట్టింది.
Chandrababu : ఏపీ ప్రజలకు చంద్రబాబు మరో గుడ్న్యూస్..!
ఈ కొత్త విధాన ప్రకారం.. ఒకే ప్లాట్ను రెండు విడతలుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్లాట్ విలువలో 60% బేస్ ప్రైస్గా పరిగణించి దానిపై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయనున్నారు. మిగిలిన 40% అభివృద్ధి ఛార్జీలపై మాత్రం కేవలం 0.5% మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు విధించనున్నారు. ఈ విధానం వల్ల మొత్తం రిజిస్ట్రేషన్ ఖర్చు గణనీయంగా తగ్గనుంది. ప్రజలపై పడే భారం తగ్గేలా ఈ మార్పులు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రయోజనం ఇప్పటికే లాటరీ ద్వారా ప్లాట్ కేటాయించుకున్న వారికీ వర్తించనుంది.
ఈ విధానం CRDA, విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అమలులోకి రానుంది. దీనికి అనుగుణంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలు త్వరలో తమ ప్లాట్లను రెండు విడతల రిజిస్ట్రేషన్ విధానంలో నమోదు చేసుకునే అవకాశాన్ని పొందనున్నారని ప్రకటించారు. మధ్యతరగతి వర్గానికి ఇంటి కలను నిజం చేయడంలో ఈ నిర్ణయం ప్రధానంగా సహాయపడుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
This website uses cookies.