
Chandrababu : మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు.. అసలు విషయం తేల్చట్లేదుగా..!
Chandrababu : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాం ఇస్తుండగా, అక్కడి మహాత్మా మందిర్లో ఓ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు అక్కడికి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ పటేల్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి హాజరయ్యారు.ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గుజరాత్ లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సదస్సుకు హాజరై, ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాదక ఇంధన శక్తిసామర్థ్యాల గురించి వివరించానని వెల్లడించారు.
భిన్న రకాల వాతావరణాలను తట్టుకునేలా మన ఇంధన రంగానికి అనుకూల వ్యూహాలను రూపొందించడం అత్యావశ్యకం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకోసం… శక్తి ఉత్పాదన, ప్రసారం, పంపిణీ, శక్తి వినియోగ విధానంలో ప్రాథమిక మార్పు అవసరం అని పేర్కొన్నారు. ఈ కోణంలోనే, 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు. ప్రజా శ్రేయస్సు కోసం సాంకేతికత అంశంలో ఏపీ అగ్రగామిగా ఉందని, ఇప్పుడు ఇంధన రంగం వంతు అని చంద్రబాబు స్పష్టం చేశారు.రీ-ఇన్వెస్ట్ సదస్సులో ప్రసంగించిన తర్వాత ప్రధాని మోదీ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వేదికపై ఆయనతో కరచాలనం చేసి ఏదో విషయాన్ని ఆయనకు వివరించారు. మైక్ శబ్ధం ఎక్కువ ఉండటంతో దగ్గరకు వచ్చిన మరీ ఆయనతో ఏదో చెప్పారు. దాదాపు 15 సెకన్లు పాటు చంద్రబాబుకు మోదీ షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నారు.
Chandrababu : మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు.. అసలు విషయం తేల్చట్లేదుగా..!
మోడీతో కలసి ఉండడం వేదిక పంచుకోవడం ఇవన్నీ బాబుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. చిన్న చిన్న వాటికి బాబు ఇలా ఉప్పొంగిపోతే ఎలా? ఏపీ వరదలతో భారీ వానలతో అన్ని రకాలుగా నష్టపోయింది కేంద్రం ఇచ్చిన తక్షణ సాయం ఏమిటి అన్నది అందరి మాటగా ఉంది. ఏపీకి మోడీ ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చి ఏపీని ఆదుకుంటే బాగుంటుంది కదా అని కూడా అంటున్నారు. ఇప్పటికే ఏడు వేల కోట్ల రూపాయల వరద నష్టం అని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. కేంద్ర బృందం కూడా తన నివేదికను తయారు చేసింది. వీటి మీద కేంద్రం తక్షణం స్పందించి ఏమైనా సాయం చేస్తే మోడీ చేసిన సాయానికి ఏపీ ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తారు కదా అని అంటున్నారు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.