
Chandrababu : మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు.. అసలు విషయం తేల్చట్లేదుగా..!
Chandrababu : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాం ఇస్తుండగా, అక్కడి మహాత్మా మందిర్లో ఓ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు అక్కడికి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ పటేల్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి హాజరయ్యారు.ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గుజరాత్ లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సదస్సుకు హాజరై, ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాదక ఇంధన శక్తిసామర్థ్యాల గురించి వివరించానని వెల్లడించారు.
భిన్న రకాల వాతావరణాలను తట్టుకునేలా మన ఇంధన రంగానికి అనుకూల వ్యూహాలను రూపొందించడం అత్యావశ్యకం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకోసం… శక్తి ఉత్పాదన, ప్రసారం, పంపిణీ, శక్తి వినియోగ విధానంలో ప్రాథమిక మార్పు అవసరం అని పేర్కొన్నారు. ఈ కోణంలోనే, 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు. ప్రజా శ్రేయస్సు కోసం సాంకేతికత అంశంలో ఏపీ అగ్రగామిగా ఉందని, ఇప్పుడు ఇంధన రంగం వంతు అని చంద్రబాబు స్పష్టం చేశారు.రీ-ఇన్వెస్ట్ సదస్సులో ప్రసంగించిన తర్వాత ప్రధాని మోదీ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వేదికపై ఆయనతో కరచాలనం చేసి ఏదో విషయాన్ని ఆయనకు వివరించారు. మైక్ శబ్ధం ఎక్కువ ఉండటంతో దగ్గరకు వచ్చిన మరీ ఆయనతో ఏదో చెప్పారు. దాదాపు 15 సెకన్లు పాటు చంద్రబాబుకు మోదీ షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నారు.
Chandrababu : మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు.. అసలు విషయం తేల్చట్లేదుగా..!
మోడీతో కలసి ఉండడం వేదిక పంచుకోవడం ఇవన్నీ బాబుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. చిన్న చిన్న వాటికి బాబు ఇలా ఉప్పొంగిపోతే ఎలా? ఏపీ వరదలతో భారీ వానలతో అన్ని రకాలుగా నష్టపోయింది కేంద్రం ఇచ్చిన తక్షణ సాయం ఏమిటి అన్నది అందరి మాటగా ఉంది. ఏపీకి మోడీ ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చి ఏపీని ఆదుకుంటే బాగుంటుంది కదా అని కూడా అంటున్నారు. ఇప్పటికే ఏడు వేల కోట్ల రూపాయల వరద నష్టం అని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. కేంద్ర బృందం కూడా తన నివేదికను తయారు చేసింది. వీటి మీద కేంద్రం తక్షణం స్పందించి ఏమైనా సాయం చేస్తే మోడీ చేసిన సాయానికి ఏపీ ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తారు కదా అని అంటున్నారు.
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
Vizag Steel Plant Blast : విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.…
Indian Railways Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో…
Singareni Jobs 2026 : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) శుభవార్త అందించింది.…
Habsiguda : హైదరాబాద్ నగరంలోని హబ్సీగూడ డివిజన్ పరిధిలో ఉన్న కాకతీయ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య…
Gas Subsidy Cylinders : దేశవ్యాప్తంగా కోట్లాది మంది వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. గత కొన్ని రోజులుగా…
Turmeric and Black Pepper Water : ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలంటే రోజు ప్రారంభం ఎలా జరుగుతుందనేది చాలా ముఖ్యం.…
Ginger Tea vs Lemon Tea : ఉదయం నిద్రలేచిన వెంటనే చాలా మంది చేతిలో కనిపించే మొదటి పానీయం…
Nithya Menen Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కిన భారీ…
Heavy Rains : దేశవ్యాప్తంగా వర్షాకాలం క్రమంగా బలపడుతున్న వేళ, భారత వాతావరణ శాఖ (IMD) కీలక సమాచారం వెల్లడించింది.…
This website uses cookies.