
Roja : రోజా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమా.. ఆమెపై సీఐడీకి ఫిర్యాదు చేసిందెవరంటే..!
Roja : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఫలితాలు వచ్చినప్పటి నుండి టీడీపీ శ్రేణులు వైసీపీ నేతల ఇళ్లపై దాడులకు తెగబడటంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల వైఎస్సార్ విగ్రహాలను కూల్చేసి వాటి స్థానంలో ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు దిగుతోందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమలో కొందరిని అరెస్ట్ చేసి కూటమి నాయకులు జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ చేసిన అరాచకాలని బయటపెడతామంటూ కూటమి నాయకులు ప్రచారంలో చెప్పుకొచ్చారు.
అయితే అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత సైతం ఇదే రకమైన హెచ్చరికలు చేశారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య కేసును రీఓపెన్ చేయిస్తామని తెలిపారు. అలాగే టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై సమీక్ష చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే పదునైన మాటలతో ప్రత్యర్ధులని వణుకు పుట్టించే రోజా జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ ఛైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించింది. తర్వాత మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణలో మంత్రి పదవిని కొట్టేశారు. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా ఓ వెలుగు వెలిగారు. వేదికలపై డ్యాన్సులు, పిల్లలతో కలిసి ఆటలు ఆడుతూ నిత్యం వార్తల్లో నిలిచేవారు.
Roja : రోజా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమా.. ఆమెపై సీఐడీకి ఫిర్యాదు చేసిందెవరంటే..!
జగన్ కేబినెట్లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం – ఆంధ్ర, సీఎం కప్ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు స్కాం జరిగిందని.. రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. ఈ మేరకు సీఐడీకి ఆత్యా – పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాంపై సీఐడీకి సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.రు. క్రీడాకారుల కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందినవారిపై విచారణ జరపాలని నేతలు చెబుతున్నారు. చూస్తుంటే రోజా అరెస్ట్ ఖాయంగా కొందరు చెప్పుకొస్తున్నారు.
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…
This website uses cookies.