Home » Andhra Pradesh » Complaint To Cid Against Ex Minister Rk Roja
andhra pradesh

Roja : రోజా క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్ల‌డం ఖాయ‌మా.. ఆమెపై సీఐడీకి ఫిర్యాదు చేసిందెవ‌రంటే..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 17, 2024, 7:00 pm
Advertisement

Roja : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావ‌డంతో వైసీపీ నాయ‌కుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్పటి నుండి టీడీపీ శ్రేణులు వైసీపీ నేతల ఇళ్లపై దాడులకు తెగబడటంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల వైఎస్సార్ విగ్రహాలను కూల్చేసి వాటి స్థానంలో ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు దిగుతోందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. త‌మ‌లో కొంద‌రిని అరెస్ట్ చేసి కూట‌మి నాయ‌కులు జైలుకి పంపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ చేసిన అరాచ‌కాల‌ని బ‌య‌ట‌పెడ‌తామంటూ కూట‌మి నాయ‌కులు ప్ర‌చారంలో చెప్పుకొచ్చారు.

Advertisement

Roja రోజాకి బ్యాడ్ టైం స్టార్ట్..

అయితే అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత సైతం ఇదే రకమైన హెచ్చరికలు చేశారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య కేసును రీఓపెన్ చేయిస్తామని తెలిపారు. అలాగే టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై సమీక్ష చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే పదునైన మాటలతో ప్రత్యర్ధులని వ‌ణుకు పుట్టించే రోజా జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించింది. తర్వాత మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణలో మంత్రి పదవిని కొట్టేశారు. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా ఓ వెలుగు వెలిగారు. వేదికలపై డ్యాన్సులు, పిల్లలతో కలిసి ఆటలు ఆడుతూ నిత్యం వార్తల్లో నిలిచేవారు.

Roja : రోజా క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్ల‌డం ఖాయ‌మా.. ఆమెపై సీఐడీకి ఫిర్యాదు చేసిందెవ‌రంటే..!

Advertisement

జగన్ కేబినెట్‌లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం – ఆంధ్ర, సీఎం కప్‌ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు స్కాం జరిగిందని.. రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. ఈ మేరకు సీఐడీకి ఆత్యా – పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాంపై సీఐడీకి సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.రు. క్రీడాకారుల కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందినవారిపై విచారణ జరపాలని నేతలు చెబుతున్నారు. చూస్తుంటే రోజా అరెస్ట్ ఖాయంగా కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి