JC Prabhakar Reddy : వైసీపీలో అందరు మంచోళ్లే.. వాడే మారాలి.. జేసీ సంచలన వ్యాఖ్యలు..
ప్రధానాంశాలు:
Ys jagan : వైసీపీలో అందరు మంచోళ్లే.. వాడే మారాలి.. జేసీ సంచలన వ్యాఖ్యలు..
JC Prabhakar Reddy : వైసీపీ Ysrcp అధినేత జగన్ అంటేనే కారాలు మిరియాలు నూరే అనంతపురం జిల్లాకు చెందిన, టీడీపీ TDP నాయకుడు, తాజాగా వైసీపీ అధినేత జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ Ys Jagan మారాలి. లేకపోతే.. కష్టమే. ఇంకా బెదిరింపులు.. సాధింపులు చేస్తానంటే.. ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు కూడా రక్షణ కోరుకుంటున్నారు. బెదిరింపులతో రాజకీయాలు చేయలేరు. ఆ రోజులు పోయాయి. వాళ్ల నాయన కూడా మారాడు. అందుకే ప్రజలు యాక్సప్ట్ చేశారు అని జేసీ వ్యాఖ్యానించారు.

JC Prabhakar Reddy : వైసీపీలో అందరు మంచోళ్లే.. వాడే మారాలి.. జేసీ సంచలన వ్యాఖ్యలు..
JC Prabhakar Reddy మారాలి…
ప్రస్తుతం అభివృద్దిని కోరుకుంటున్న ప్రజలు.. జగన్ను ఎందుకు పక్కన పెట్టారో తెలుసుకోవడం ఈజీనేని చెప్పారు. అందరికీ ఈ విషయంపై క్లారిటీ ఉందని.. కానీ జగన్కే క్లారిటీ లేదని అన్నారు. ఇప్పటికైనా మార్పు దిశగా జగన్ అడుగులు వేయకపోతే.. ఆయనతో పాటు పార్టీలో ఉన్నవారు కూడా.. భూస్థాపితం అయిపోతారని అన్నారు. ప్రజల్లోకి రావడానికి జగన్కు ఇంకా సమయం ఉందని వ్యాఖ్యానించారు.
అయితే.. ఒక టీడీపీ TDP నాయకుడిగా తాను జగన్ గురించి మాట్లాడడం లేదన్న జేసీ.. వైఎస్ Ys Jagan కుటుంబానికి ముఖ్యంగా విజయమ్మ మొహం చూసి జగన్కు సలహా ఇస్తున్నానని చెప్పారు. “పార్టీలో అందరూ మంచోళ్లే. కానీ,.. డే మొండి ఘటం. ఎవరి మాట వినడు. చెబితే అర్ధం చేసుకోడు. ఏం చేస్తారు పాపం ” అని జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి కూటమి మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగించినా, జగన్ తో మాత్రం తొలి నుంచి జేసీ కుటుంబం విభేదిస్తూనే వస్తోంది