Election Money : మే 11 సాయంత్రం 6గంటలతో ప్రచారానికి పులిస్టాప్ పడింది. అన్ని మైకులు మూగబోయాయి. నాయకులు చల్లపడ్డారు. తమవంతు ప్రచారాలు చేశారు. గెలిపించడం, ఓడించడం ఓటర్లకి వదిలేసారు. అయితే ఎన్నికలు అత్యంత కాస్ట్లీగా మారాయి. అందులో ఓట్ల కొనుగోలు అనేది ఓ పెద్ద ప్రక్రియ. దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షనీరింగ్ అనే పేరు పెట్టుకోవడం విశేషం. ఈ సారి ఎన్నికల్లో డబ్బు పంపిణీ ప్రక్రియ జోరు మీద సాగింది. నిజానికి ప్రచారం ముగిసిన రోజు రాత్రి గతంలో డబ్బుల పంపిణీ పూర్తి చేసేవారు. ఈ సారి అలా లేదు. మూడు రోజుల ముందు నుంచే బూత్ల వారీగా డబ్బులు పంపకాలు చేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తడా లేకుండా అన్ని పార్టీలు అందరికీ పంపిణీ చేయడమే ఈ సారి ఏపీ ఎన్నికల్లో కీలకం. ఓ రకంగా ఇది లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ని తీసుకువచ్చిందని అనుకోవచ్చు. కానీ ఓటుకు నోటు అనేది నేరం. దీన్ని ఈసీ ఎందుకు ఆపలేకపోతోందనేది కీలకంగా మారింది.
ఇప్పటికే చాలామంది నేతలు తమ నియోజకవర్గాలలో కూడా ప్రజలకు డబ్బు పంచడం జరిగింది.. అయితే ఈ డబ్బు పంపిన విషయంలో కూడా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ కి డబ్బులు పంచడం కోసం పార్టీలు కొన్ని డైరెక్ట్ గా పంపించాయి..ఎంపీ కాండేట్లు కూడా మరి కొంతమంది డబ్బులను ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు తమ ఆస్తులను తాకట్టు పెట్టి మరి ప్రజలకు డబ్బు పంచుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లోకి పంపించినప్పుడు ఇప్పుడు వినపడుతున్నటువంటి మాట ఏమిటంటే.. వైసీపీ కానీ టిడిపి పార్టీ కానీ ఒక్కో ఓటుకు 2000 పంచాలనుకున్నారట.. చాలా చోట్ల కూడా ఇదే జరుగుతోంది. అయితే కొంతమంది మాత్రం ఓటుకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారట.
అయితే ఇలా జరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే స్థానిక నాయకులు తమకు ఇన్ని రోజులు ఖర్చయింది కదా అంటూ.. అందులో కొంత మొత్తాన్ని అక్కడి నేతలే పంచుకుంటున్నారు. ఇక డబ్బులు పంపిణీ కార్యక్రమంతో మీ ఊరిలో ఎవరు ఎంతిస్తున్నారు అనే ప్రశ్న. గత కొద్ది రోజులుగా ఏ ఇద్దరు కూర్చొని మాట్లాడిన రాజకీయం గురించే. ఎవరు గెలుస్తారు. పార్టీ తరపున ఎంత డబ్బు ఇస్తారు వంటి వాటి గురించే చర్చ. అయితే ఎలక్షన్ ప్రచారం ముగియడంతో డబ్బులు పంచుతారని భావిస్తున్న ఓటర్లు ఏ పార్టీ ఎంత ఇస్తుంది, ఎక్కడ ఎంత పంచుతున్నారు అనే దాని గురించి చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే మీ ఊరిలో ఎవరు ఎంతిస్తున్నారు అనే ప్రశ్న ట్రెండింగ్లోకి వచ్చేసింది.
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
This website uses cookies.