జనాలు రోజురోజుకి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మద్యం ఒకటి అలవాటు చేసుకొని ఆ మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం కావడం లేదు. ఇలా మద్యం మత్తులో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అయినా కానీ మద్యం తీసుకోవడం మాత్రం అసలు మానేయరు. వీరికి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియదు కానీ రోజు రోజుకి మద్యం అలవాటు వలన తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. తాజాగా ఒంగోలులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడి పై మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అతని నోట్లో మూత్రం పోసి వీడియో తీశారు. దాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మన్నే రామాంజనేయులు, మోటా నవీన్ ఇద్దరు చిన్నప్పటినుంచి స్నేహితులు. వీరిద్దరూ చెడు తిరుగుళ్ళు తిరుగుతూ నేరాలకు పాల్పడేవారు. వీరిపై దాదాపు 50 దొంగతనం కేసులు ఉన్నాయి. నవీన్ పోలీసులకు పట్టుబడి శిక్ష అనుభవించాడు. రామాంజనేయులు తప్పించుకొని తిరుగుతూ ఉండేవాడు. అయితే కొంతకాలంగా విరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. రామాంజనేయులు పథకం ప్రకారం నవీన్ ని ఒక నెల రోజుల కింద మద్యం తాగటానికి పిలిచాడు. ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వెనుక వైపు తీసుకుని వెళ్ళాడు. అక్కడ మరో 9 మంది యువకులు ఉన్నారు.
అందరూ కలిసి తాగి మద్యం మత్తులో పాత వివాదం గురించి మాట్లాడుకుంటూ మాటా మాట తిరిగి నవీన్ పై దాడికి పాల్పడ్డారు. అందరూ కలిసి నవీన్ ని చితకబాదారు. అతను వదలండని బ్రతిమాలిన వదలకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. అంతేకాకుండా బాధితుడు నోట్లో మూత్రం పోసి తాగాలని బలవంతం చేశారు. దానిని ఫోన్లో వీడియో తీశారు. నెల రోజుల కింద జరిగిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పటికే నవీన్ పోలీసులు ఫిర్యాదు ఇచ్చాడు కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది పై అధికారుల దాకా వెళ్లడంతో నవీన్ ను కొట్టిన వాళ్లను పట్టుకొని విచారిస్తున్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.