Good News to Farmers : రైతులకు శుభవార్త .. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోనిధులు జమ ..!
ప్రధానాంశాలు:
Grain Collection Funds : రైతులకు శుభవార్త .. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోనిధులు జమ ..!
Good News to Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని వరుస కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. ధాన్యం సేకరణకు సంబంధించిన చెల్లింపులను 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వేగవంతమైన చెల్లింపు విధానం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా తదుపరి సాగు పనులను ప్రణాళికాబద్ధంగా కొనసాగించగలుగుతున్నారు. రైతులకు నేరుగా లబ్ధి చేకూరేలా పారదర్శక విధానాలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక మరోవైపు “అన్నదాత సుఖీభవ” పథకం మూడో విడత నిధులను ఈ నెలలోనే విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్తో కలిపి జమ చేయాలని యోచిస్తోంది. పీఎం కిసాన్ నిధులు వచ్చే వారం రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రైతులకు ఒకేసారి ద్వంద్వ లబ్ధి చేకూరనుంది.
Grain Collection Funds : రైతులకు శుభవార్త .. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోనిధులు జమ ..!
Good News to Farmers : శనగల సేకరణకు శ్రీకారం
రైతులకు మరింత ఊరటనిచ్చే మరో నిర్ణయంగా ప్రభుత్వం శనగల సేకరణను ప్రారంభించనుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం రబీ సీజన్ 2025-26లో పండించిన శనగలను ప్రభుత్వ మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18 నుంచి సీఎం యాప్ ద్వారా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. శనగలు కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఆలస్యం లేకుండా డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి శనగల కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు.
Good News to Farmers : సాగు విస్తీర్ణం, ఉత్పత్తి అంచనాలు
రాష్ట్రంలో రబీ సీజన్లో సుమారు 3.25 లక్షల హెక్టార్లలో శనగల సాగు జరిగినట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. దాదాపు 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు తమ పంటను ముందుగా స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని సూచించింది. కొనుగోలు చేసిన శనగలను ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేసి 15 రోజుల్లోపు చెల్లింపులు పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతాయని, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు.
Good News to Farmers : విభాగాల సమన్వయంతో పారదర్శక అమలు
శనగల కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయం, మార్కెటింగ్, ఏపీ మార్క్ఫెడ్, సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ తదితర శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొనుగోళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసింది. రైతులకు న్యాయమైన ధర, వేగవంతమైన చెల్లింపులు, పారదర్శక విధానం ఈ మూడు అంశాలను ప్రధానంగా ఉంచుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వరుస నిర్ణయాలతో రైతుల నమ్మకాన్ని పెంచుకుంటూ వ్యవసాయ రంగానికి బలమైన మద్దతు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.