Chandrababu Bail : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబుకు తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ సాయంత్రం చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు రాజమండ్రి జైలు బయట తొలిసారి మాట్లాడారు. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ విషయంపై ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డబ్బు రూ.371 కోట్లు దోపిడికి గురయిందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు వెళ్లాయి. దొంగ బిల్లులు సబ్మిట్ చేసి, ఫేక్ ఇన్ వాయిస్ క్రియేట్ చేసి రూ.371 కోట్లు కొల్లగొట్టారు అని తేలింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజా సంక్షేమానికి వాడాల్సిన డబ్బు అది. దోపిడికి గురయినప్పుడు ఆ ప్రభుత్వం స్పందించలేదు. దీనికి మూలం గత ప్రభుత్వ పెద్దలే కాబట్టి దాన్ని ఖాతరు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.371 కోట్లు ప్రజలకు చెందాల్సిన డబ్బు.. ఒక వర్గం చేతుల్లోకి డబ్బులు వెళ్లిపోయి.. దోపిడికి గురయింది కాబట్టి ఈ ప్రభుత్వం దీని పూర్వాపరాలు విచారించాలని భావించింది.
ఈ ప్రభుత్వం వచ్చాక అధికారులు విచారణ చేపట్టారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 90 శాతం ఫ్రీగా జర్మన్ కంపెనీ ఇస్తున్నట్టుగా ఉంది. అందులో రూ.371 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పెట్టుకున్నట్టుగా ఉంది. ఎంఓయూ కూడా చేశారు కానీ.. అందులో ఎలాంటి సిగ్నేచర్స్ లేవు. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఖాతా కిందనే రూ.371 కోట్లు పెట్టేలా ఉంది. ఆ ప్రాజెక్టు మొదలుపెట్టలేదు. వాళ్లు 90 శాతం తీసుకురాలేదు. భూమి మీద ప్రాజెక్టు క్రియేట్ చేసి వాళ్లు 90 శాతం పెట్టుబడి పెడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. అయినా కూడా ఫైనాన్స్ సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. గత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మేము రిలీజ్ చేశామని నోట్ ఫైల్ రాశారు. ఇప్పటికే అందులో 36 మందిని అరెస్ట్ చేశారు. అందులో కొందరికి బెయిల్ కూడా వచ్చింది. అప్పటి సీఎంను 37వ ముద్దాయిగా చేర్చారు.
ఇప్పుడు చంద్రబాబుకు బెయిల్ వచ్చింది కానీ.. అది ప్రత్యేక పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చారు. ఖచ్చితంగా చంద్రబాబు మళ్లీ సరెండర్ కావాల్సిందే. నాలుగు వారాల తర్వాత సరెండర్ కావాలి. బెయిల్ మధ్యంతరంగా ఇచ్చింది మాత్రమే. ప్రధాన బెయిల్ మీద నవంబర్ 10న విచారణ జరగనుంది. కోర్టు వారి నిర్ణయాన్ని అందరం పాటిస్తాం అని చంద్రబాబు బెయిల్ పై లాయర్ చెప్పుకొచ్చారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.