BIG NEWS : జగన్ హెలీకాప్టర్ కోసం రైతుల భూమి లాక్కున్నారా ?
ప్రధానాంశాలు:
BIG NEWS : జగన్ హెలీకాప్టర్ కోసం రైతుల భూమి లాక్కున్నారా ?
BIG NEWS Tadepalli Helipad Land Issue : ఆంధ్రప్రదేశ్ Andrah pradesh రాజకీయాల్లో తాడేపల్లి హెలీప్యాడ్ భూమి Helipad Land వ్యవహారం అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైసీపీ YCP మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఇంటి పక్కన హెలీప్యాడ్ నిర్మించుకోవడం కోసం ఒక రైతుకు చెందిన 10 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాధిత రైతు తనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో మార్చి ఈ అక్రమానికి పాల్పడ్డారని సీఎం విమర్శించారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.
జగన్ హెలీకాప్టర్ కోసం రైతుల భూమి లాక్కున్నారా ?
చంద్రబాబు ఆరోపణలను వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి తీవ్రంగా ఖండించారు. హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన స్థలం దశాబ్దాలుగా రైల్వే మరియు ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని, అక్కడ ఏ రైతు సాగు చేసిన ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సర్వే నంబర్లు 223, 226/C2 పరిధిలోని 10.04 ఎకరాల భూమి 2015లోనే (టీడీపీ హయాంలోనే) కలెక్టర్ ఆధీనంలో ఉన్నట్లు రికార్డులు (RC No. 22/7) చెబుతున్నాయని వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి రాకముందే అది ప్రభుత్వ భూమిగా ఉన్నప్పుడు, ఇప్పుడు దానిని రైతుల దగ్గర లాక్కున్నామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని ఆయన మండిపడ్డారు.
వాస్తవానికి ఈ స్థలం గతంలో ‘ఈఐడీ ప్యారీ’ అనే కంపెనీకి లీజుకు ఇవ్వబడిందని, ఆ తర్వాత అది ప్రభుత్వ పరమైందని వైసీపీ నేతలు ఆధారాలను బయటపెట్టారు. ముఖ్యమంత్రి భద్రత మరియు ప్రయాణ అవసరాల దృష్ట్యా ఏవియేషన్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే అక్కడ హెలీప్యాడ్ నిర్మించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ఇలాంటి పాత విషయాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని దొంతిరెడ్డి వేమారెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లి హెలీప్యాడ్ వివాదం ఇప్పుడు రికార్డుల యుద్ధంగా మారి, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా కొనసాగుతోంది.