Janasena : బిగ్ బ్రేకింగ్ : జనసేన కి మరో మంత్రి పదవి..?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 10 August 2026, 7:00 pm
  •  Janasena జనసేనకు నాలుగో మంత్రి పదవి ఎవరికి దక్కనుంది? నాగబాబు, కొణతాల రామకృష్ణ, వంశీ కృష్ణల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఉత్తరాంధ్ర ఫ్యాక్టర్ రాజకీయ చర్చలను వేడెక్కిస్తోంది.

Janasena  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. రెండో అతిపెద్ద మిత్రపక్షంగా నిలిచిన జనసేన, 2024 ఎన్నికల్లో కేవలం 21 సీట్లతో పోటీ చేసి, అన్ని సీట్లలో గెలిచి సెంటుపర్సెంట్ స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. ఇది రాజకీయంగా పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఈ విజయంతో జనసేనకు ప్రభుత్వంలో కూడా గణనీయమైన ప్రాధాన్యం లభించింది.ప్రస్తుతం జనసేనకు కేబినెట్‌లో మూడు మంత్రి పదవులు ఉన్నాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, ఐదు ముఖ్యమైన శాఖలను తన ఆధీనంలో ఉంచుకున్నారు. అలాగే నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటక శాఖలు కేటాయించారు. ఈ ముగ్గురు మంత్రులు తమ తమ శాఖల్లో సమర్థంగా పనిచేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది.

Janasena : బిగ్ బ్రేకింగ్ : జనసేన కి మరో మంత్రి పదవి..?

Janasena : బిగ్ బ్రేకింగ్ : జనసేన కి మరో మంత్రి పదవి..?

Janasena  నాలుగో మంత్రి హామీ – ఎవరికి దక్కే ఛాన్స్?

జనసేనకు మరో మంత్రి పదవి ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చిన విషయం ఇప్పుడు మళ్లీ ప్రస్తావనలోకి వచ్చింది. ముఖ్యంగా నాగబాబుకు రాజ్యసభ అవకాశంలేకపోవడంతో, ఆయనను కేబినెట్‌లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అందువల్ల మంత్రి వర్గ విస్తరణ జరిగితే నాలుగో మంత్రి జనసేన నుంచే ఉండటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పద్ధతి ప్రకారం చూస్తే నాగబాబు ఈ పదవికి అర్హుడే. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై చట్ట సభ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే విమర్శలు వచ్చే అవకాశముందని పార్టీ లోపలే చర్చ జరుగుతోంది. అదనంగా, ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్న నేపథ్యంలో, మూడో వ్యక్తి కూడా అదే వర్గానికి చెందినవారైతే రాజకీయంగా ప్రతికూలతలు రావచ్చని ఆలోచిస్తున్నారు.

Janasena  ఉత్తరాంధ్ర ఫోకస్ – బీసీలకు మంత్రి పదవి?

ఇక జనసేన విస్తరణలో భాగంగా ఉత్తరాంధ్రపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో పార్టీ బలం పెంచేందుకు నాలుగో మంత్రి పదవిని ఉత్తరాంధ్రకే కేటాయించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా బీసీ వర్గానికి ఈ అవకాశం ఇవ్వాలని పార్టీ లోపల చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్రలో జనసేనకు ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బీసీ వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చలోకి వస్తున్నారు. ఒకరు సీనియర్ నేత కొణతాల రామకృష్ణ. ఆయనకు విస్తృత రాజకీయ అనుభవం ఉంది. వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా పేరు ఉంది. గవర సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.

మరోవైపు విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. యువ నాయకుడిగా ఎదుగుతున్న ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. విశాఖ నగరంలో ఈ వర్గం ప్రభావం ఎక్కువగా ఉండటంతో, వంశీకి అవకాశం ఇస్తే రాజకీయంగా పార్టీకి మేలు జరుగుతుందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో జనసేన బలం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రాంతానికి మంత్రి పదవి ఇవ్వడం పార్టీ వ్యూహంలో కీలకంగా మారింది. అయితే చివరికి నాగబాబు, కొణతాల, వంశీ కృష్ణలలో ఎవరికి ఈ పదవి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp