man attacked his children with axe in kadapa
Crime News : సంక్రాంతి పండుగ అనేది అందరికీ చాల పెద్ద పండుగ. ఆ రోజు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపాలి. కానీ.. ఓ కుటుంబం ఇంట్లో మాత్రం సంక్రాంతి పండుగ నాడు రక్తం ఏరులై పారింది. బోగి పండుగ రోజున ఊరంతా భోగి మంటలు వేసేందుకు సిద్ధం అవుతుండగా ఒక్కసారిగా ఊరంతా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ ఘటన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మండలం నక్కలదిన్నె అనే గ్రామంలో చోటు చేసుకుంది.
man attacked his children with axe in kadapa
నక్కలదిన్నె అనే గ్రామానికి చెందిన 47 ఏళ్ల నరసింహరెడ్డికి ఒక కొడుకు, ఒక కూతురు. రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత నిద్రిస్తున్న సమయంలో తన ఇద్దరు పిల్లలపై నరసింహరెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. ఆ తర్వాత తాను కూడా పురుగుల మందు తాగాడు. ఇద్దరు పిల్లలు ఆర్తనాదాలు చేయడంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు, చుట్టు పక్కన వాళ్లు నిద్ర లేచి ఏమైంది అని చూసేసరికి.. ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారు.
పురుగుల మందు తాగిన నరసింహారెడ్డి.. ఆసుపత్రికి వెళ్లగానే చనిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న పిల్లలను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంటనే పావనిని కడప రిమ్స్ కు, అభితేజను హైదరాబాద్ కు తరలించారు. అయితే.. మానసిక పరిస్థితి సరిగా లేక.. నరసింహారెడ్డి ఇలా సొంత పిల్లలపైనే దాడికి పాల్పడ్డాడని చెబుతున్నారు. నరసింహారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సొంత తండ్రే ఇలా పిల్లలపై దాడికి తెగబడతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. పండుగ పూట నక్కలదిన్నె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
This website uses cookies.