
#image_title
Marriage : బంధుమిత్రుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఓ పేళ్లి వేడుక జరుగుతుంది. కుటుంబ సభ్యులు బంధు మిత్రులందరూ నవ దంపతులను ఆశీర్వదించేందుకు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి పీటలపై వరుడు వధువు కూర్చుని ఉన్నారు. పురోహితుడు వేదమంత్రాలు చదువుతుండగా మరికొద్ది సేపట్లో వరుడు వధువు మెడలో తాళి కట్టబోతున్నాడు. ఇంతలోనే సినిమా లెవల్ లో పెళ్లి ఆపండి అంటూ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఏంటి సినిమా కథ చెబుతున్నాడు అనుకుంటున్నారా..?అసలు కాదండి ఇది రియల్ స్టోరీ.. అవును మీరు వింటున్నది నిజమే. అయితే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వరుడు తనని మోసం చేసి మరో యువతుతో పెళ్లి చేసుకుంటున్నాడని ఓ యువతి వరుడుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిలవని పెళ్లికి పోలీసులు అతిథులుగా రావాల్సి వచ్చింది. దీంతో వధువు తల్లిదండ్రులు బంధుమిత్రులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే…
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ల కోటకు చెందిన మహేంద్ర నాయుడుకి కర్నూల్ ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇక వీరి పెళ్లి ముహూర్తం ఈనెల 20వ తేదీన ఉదయం 9 గంటలకు బ్రహ్మగుండం క్షేత్రంలో చేయాలి అనుకున్నారు. అయితే పెళ్లి పొద్దున్నే కావడంతో కుటుంబ సభ్యులంతా రాత్రికి అక్కడికి చేరుకున్నారు. ఇక పొద్దు పొద్దున్నే పెళ్లి తతంగం అంతా ప్రారంభమైంది. మరి కాసేపట్లో వరుడు మహేంద్ర నాయుడు వధువు మెడలో తాళి కట్టబోతున్నాడు అనంగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోయింది. అయితే వరుడు మహేంద్ర నాయుడు ఓ అమ్మాయిని మోసం చేశాడని ఫిర్యాదు ఇవ్వడం, అంతేకాక వారిద్దరు దిగిన ఫోటోలను పోలీసులకు చూపించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ బాధితురాలు ఉమ్మడి విశాఖ జిల్లా చింతపల్లి వాసి అని తెలుస్తోంది. ఇక బాధితురాలు చెబుతున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాకు గతంలోనే పెళ్లయింది.
పెళ్లయిన 6 నెలలకే మనస్పర్దాల కారణంగా భర్తతో విడిపోయాను. ఆ సమయంలోనే మహేంద్ర నాయుడు నాకు ఇన్-స్టా లో పరిచయం అయ్యాడు. అతను వైజాగ్ లో పని చేసేవాడు. మేమిద్దరం గత ఆరేళ్లుగా రిలేషన్ లో కొనసాగుతున్నాము. అయితే కొన్ని గొడవలు కారణంగా నేను అతడిని దూరం పెట్టాను. ఆ సమయంలో మహేంద్ర నాయుడు నేను నిన్నే ప్రేమించాను, నువ్వు లేకపోతే నేనులేను ,నువ్వంటే ప్రాణం, నిన్నే పెళ్లి చేసుకుంటా అంటూ నా ఫ్యామిలీ దగ్గరికి కూడా వచ్చి చెప్పాడు. అతని మాటలు నిజమేనని నేను నమ్మాను. నాకు తల్లిదండ్రులు కూడా లేరు. అయితే నా దగ్గరకు ఈనెల 19న వస్తానని చెప్పిన మహేంద్ర నాయుడు రాలేదు. నాకు డౌట్ వచ్చి వేరే వాళ్ళను ఆరా తీస్తే అతనికి పెళ్లి కుదిరింది అని తెలిసింది. ఏం చేయాలో దిక్కు తోచక వెంటనే పోలీసులను ఆశ్రయించినట్లుగా బాధితురాలు తెలియజేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కర్నూల్ పోలీసులు పెళ్లిని ఆపేశారు. అయితే బాధితురాలతో మహేంద్ర నాయుడు దిగిన ఫోటోలను ప్రూఫ్స్ గా ఆమె అందరికీ చూపించింది. అంతేకాక పలుసార్లు అబార్షన్ కూడా చేపించుకున్నట్లుగా ఆమె తెలియజేసింది.
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
This website uses cookies.