Midhun Reddy : వైసీపీ ఎంపీ, లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఈ మధ్య ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. తనపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని.. తనకు భద్రత తక్కువగా ఉందని ఆయన కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయనకు 4+4 సీఆర్పీఎఫ్ సిబ్బంది నిత్యం ఆయనకు భద్రతగా ఉండనున్నారు.వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పుంగనూరులో ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన పుంగనూరులోకి వస్తే చాలు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది.
తాజాగా పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటించినప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వాహనానికి దుండగులు నిప్పు పెట్టారు. అయితే ఇప్పుడు ఆయనకి సెక్యూరిటీ గట్టిగానే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిథున్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్న మిథున్ రెడ్డి..2014లోనే తనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది.. ఏకంగా కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. 2014లో బీజేపీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది..పైగా కూటమిలో నాడు టీడీపీ భాగస్వామిగా ఉంది.
ఆ సమయంలో అదీ మొట్ట మొదటి సారి ఎంపీ ఆయిన మిథున్ రెడ్డి చేరిక కోసం బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసిందని వ్యాఖ్యానించడం నమ్మశక్యం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మిథున్ రెడ్డి కొద్ది రోజులక్రితం బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని కానీ, బీజేపీ నుంచి సరైన సిగ్నల్స్ రాలేదనే ప్రచారం జరుగుతుండటం..ఈ ప్రచారాన్ని ఖండించేందుకు ఈ విషయం వెల్లడించడం పట్ల అందరిలో కొత్త అనుమానాలు రేకెత్తేలా చేస్తున్నాయి. తాజా వ్యాఖ్యల ద్వారా తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బీజేపీలో చేరుతానని పరోక్షంగా సంకేతాలు పంపారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.