Categories: andhra pradeshNews

vijayasai reddy : టీడీపీ తస్మాత్‌ జాగ్రత్త… వైకాపా మొహమాటం లేకుండా మున్సిపల్‌, కార్పోరేషన్‌ ఎన్నికల్లో కూడా కుమ్మేస్తుందట

Advertisement
Advertisement

vijayasai reddy: గత ఏడాది మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో మరియు మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున ఏకగ్రీవాలు అయ్యాయి. వైకాపా వందల సంఖ్యలో పంచాయితీలను బలవంతంగా ఏకగ్రీవం చేసేసుకుంది. చాలా చోట్ల కనీసం ప్రత్యర్థి వారు పోటీ పడకుండా అడ్డుకోవడంతో పాటు దాడులకు కూడా తెగ బడ్డట్లుగా ప్రచారం జరిగింది. ఏకంగా ఎన్నికల కమీషన్‌ ఏకగ్రీవాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది అంటే వైకాపా ఏ రేంజ్‌ లో ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో జరిగిన ఏకగ్రీవాలు ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయి అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు వ్యవహరించారు. పరిషత్‌ ఎన్నికలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి కనుక ఎక్కడ ఆగాయో అక్కడ నుండి మొదలు పెట్టాలని ప్రభుత్వం ఎస్‌ఈసీని డిమాండ్ చేసింది. వారి కోరిక మేరకు అలాగే జరిగింది.

Advertisement

municipals also unanimous election says ysrcp mp vijayasai reddy

vijayasai reddy : మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా..

పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కుమ్మేసిన వైకాపా త్వరలో జరుగబోతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలకు ప్రయత్నించబోతున్నట్లుగా నిర్మొహమాటంగా ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రకటించాడు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఖచ్చితంగా వైకాపా విజయం సాధిస్తుందనే నమ్మకంను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తూనే మరో వైపు ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు ఉండబోతున్న నేపథ్యంలో వైకాపా నాయకులు ముందస్తుగానే ప్రత్యర్థి పార్టీ వారిని దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Advertisement

వైకాపా అధికార దుర్వినియోగం..

విజయ సాయి రెడ్డి మాటలపై తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నాయి. ఒక బాధ్యతగల పదవిలో ఉండటంతో పాటు ఎలాగూ అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతిపక్షాలను భయపెట్టి ఏకగ్రీవాలను చేసుకోవాలనుకోవడం ఏమాత్రం సబబు కాదని హెచ్చరించారు. ఓటర్లు ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా మీకు సరైన బుద్ది చెప్తారు. అన్ని రోజులు మీవి కావు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. పెద్ద ఎత్తున ఏకగ్రీవాలకు పాల్పడితే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తామని అధికార దుర్వినియోగం గురించి ఈసీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.

Recent Posts

Union Budget 2026 : అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్.. 7 సంచలన నిర్ణయాలు..?

Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…

17 minutes ago

Redmi Note 15 Pro 5G : రెడ్మీ నోట్ 15 ప్రో 5జీ.. 29న గ్రాండ్ ఎంట్రీ.. 200 MP కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్స్..

Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్‌లో మరో హాట్ అప్‌డేట్‌కు…

1 hour ago

Pakistan : టీ20 వరల్డ్ కప్‌పై సస్పెన్స్.. భారత్-పాక్ మ్యాచ్ ఉందా?.. లేదా ?

pakistan : టీ20 వరల్డ్ కప్  india vs pakistan t20 world cup 2026  ప్రారంభానికి ఇంకా రెండు…

2 hours ago

Telangana: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే..!

Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…

3 hours ago

Union Budget 2026 : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!

Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…

3 hours ago

Survey : ఏపీ లో సంచలనం సృష్టిస్తున్న సర్వే .. ఆ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చెయ్యబోతున్న వైసీపీ

Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…

4 hours ago

Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…

5 hours ago

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…

6 hours ago