
Nadendla Manohar : నారా లోకేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ ..
Nadendla Manohar : మంగళగిరి జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సలహాదారుల వలన వేల కోట్ల ప్రజాధనం వృధా అవుతుందని, వారి వల్ల ఎవరికి ప్రయోజనం అని ప్రశ్నించారు. సీఎం సలహాదారుల పేరుతో 680 కోట్లు ఖర్చు చేశారంటలు నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సలహాదారులపై కోర్టుకు కూడా వెళ్ళామని చెప్పారు.డివిజన్ బెంచ్ ఈ వివరాలను కోర్టుకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది అన్నారు.సలహాదారుల వలన ప్రభుత్వంలో కొత్త విధానాన్ని తెచ్చామని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. సలహాదారులుగా నియమించినట్లు చెప్పారు అన్నారు. వారందరికీ జీతాలు, అలవెన్స్, సదుపాయాలు సిబ్బందిని ప్రభుత్వమే అందిస్తుందన్నారు.సలహాదారులు సీఎం ని కలిసే పరిస్థితి లేదన్నారు.విలువలతో ఉన్న ప్రభుత్వ సలహాదారులు కొంతమంది తమకు పని లేదంటూ రాజీనామా చేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు.సుభాష్ గర్గ్, రామచంద్రమూర్తి, జుల్ఫీ వంటి వారు ఈ పదవికి రాజీనామా చేశారని తెలిపారు.
80 నుంచి 90 మంది సలహాదారుల కోసం 680 కోట్ల రూపాయలను జగన్ సర్కార్ ఖర్చు పెట్టిందని మండిపడ్డారు. వీరిలో ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరికే 140 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. అసలు ఈ సలహాదారులు ప్రభుత్వానికి సీఎంకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఉన్నత పాఠశాలలో వసతులు కల్పించకుండా, ఐబీ సిలబస్ అమలు చేస్తున్నామని అంటున్నారని, ఏ సలహాదారు చెబితే ఈ విద్యా విధానంలో మార్పు తెచ్చారు నిలదీశారు.వీరి వలన ప్రజలకు రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో ప్రభుత్వం చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారు వారెవరో కనీసం సీఎంకు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం తో రోజు మాట్లాడేది కేవలం ఇద్దరు సలహాదారులు మాత్రమేనని చెప్పారు. సీఎం మీడియా ముందుకు వచ్చి తాను పెట్టుకున్న సలహాదారులు గురించి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సొమ్మును తింటూ ప్రతిపక్షాలను సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శిస్తాడని మండిపడ్డారు. వారి సలహాల వల్ల ఏ అంశాలలో మార్పు జరిగిందో చెప్పాలని పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలను వదిలేసి సలహాదారుల కోసం సీఎం వైఎస్ జగన్ 680 కోట్లు ఖర్చు పెడతారా అని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలలో చెప్పాలని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
ఇక టీడీపీ జనసేన పొత్తు లో అంతర్గతంగా విభేదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నారా చంద్రబాబు నాయుడు జనసేనకు తెలియకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. ఇలా రెండు పార్టీల మధ్య పొత్తు సమన్వయం కుదరడం లేదనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు కూడా నారా లోకేష్ ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన పొత్తు గెలిస్తే ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండిపోయారు.
Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్ఫుల్ లవ్…
Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా Arjun…
Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…
Sreeja : బిగ్బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…
Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…
Johnny Master : చిక్రీ సాంగ్లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అసలు విషయం బయటపెట్టిన జానీ మాస్టర్…
This website uses cookies.