pawan kalyan first reaction on janasena and tdp leaders fight
TDP VS Janasena : ప్రస్తుతం ఏపీలో ఒకే ఒక్క టాపిక్ చర్చనీయాంశంగా మారింది. అదే టీడీపీ, జనసేన నేతల మధ్య గొడవ. నిజానికి టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చాయి. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని అక్కడే ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన పొత్తు రాజమండ్రి జైలు వద్దనే కన్ఫమ్ అయింది. అయితే.. టీడీపీ, జనసేన నేతల మధ్య తాజాగా గొడవ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎవరు.. అనే విషయంపై టీడీపీ, జనసేన నేతల మధ్య గొడవ జరిగింది. జనసేన, టీడీపీ నేతలు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పగటి కలలు కనొద్దు ముందే. ఏం అవకుండానే ముఖ్యమంత్రి ఎవరు.. మీకా.. మాకా అనేది ఇప్పుడే వద్దు. ముందు జగన్ ను ఓడించాలి. ఆ తర్వాత రాజు ఎవరు.. మంత్రి ఎవరు అనేది అప్పుడు ఆలోచిద్దాం అన్నారు.
ఇవన్నీ కూర్చొబెట్టి ఆరోజున మనం ఆలోచిద్దాం. ఈలోపల మనం చాలా ప్రాక్టికల్ గా కూర్చొని ఏం చేయాలి.. అనేది ఆలోచిద్దాం. దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఈలోపలే మనం పదవులేంటి.. అని ఆలోచించడం కరెక్ట్ కాదు. దీన్ని ఎవ్వరూ డీవియేట్ చేయకండి. మనోహర్ గారి అధ్యక్షతన ఈ అలయెన్స్ ను సమన్వయ పరిచే కమిటీకి అధ్యక్షుడిగా నియమిస్తున్నాం. అలాగే.. కేంద్రంలో బీజేపీ నాయకులతో, రాష్ట్రంలో ఉన్న టీడీపీ నాయకులతో ఈ సమన్వయ పరిచే కమిటీని చర్చలకు పంపిస్తాం. సమన్వయ కమిటీ పొత్తులపై నిర్ణయం తీసుకుంటుంది అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుపై కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అప్పుడే టీడీపీ, జనసేన నేతలు మాత్రం మాకే ముఖ్యమంత్రి పదవి అంటే మాకే అంటూ కొట్టుకుంటున్నారు.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.