
pawan kalyan first reaction on janasena and tdp leaders fight
TDP VS Janasena : ప్రస్తుతం ఏపీలో ఒకే ఒక్క టాపిక్ చర్చనీయాంశంగా మారింది. అదే టీడీపీ, జనసేన నేతల మధ్య గొడవ. నిజానికి టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చాయి. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని అక్కడే ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన పొత్తు రాజమండ్రి జైలు వద్దనే కన్ఫమ్ అయింది. అయితే.. టీడీపీ, జనసేన నేతల మధ్య తాజాగా గొడవ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎవరు.. అనే విషయంపై టీడీపీ, జనసేన నేతల మధ్య గొడవ జరిగింది. జనసేన, టీడీపీ నేతలు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పగటి కలలు కనొద్దు ముందే. ఏం అవకుండానే ముఖ్యమంత్రి ఎవరు.. మీకా.. మాకా అనేది ఇప్పుడే వద్దు. ముందు జగన్ ను ఓడించాలి. ఆ తర్వాత రాజు ఎవరు.. మంత్రి ఎవరు అనేది అప్పుడు ఆలోచిద్దాం అన్నారు.
ఇవన్నీ కూర్చొబెట్టి ఆరోజున మనం ఆలోచిద్దాం. ఈలోపల మనం చాలా ప్రాక్టికల్ గా కూర్చొని ఏం చేయాలి.. అనేది ఆలోచిద్దాం. దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఈలోపలే మనం పదవులేంటి.. అని ఆలోచించడం కరెక్ట్ కాదు. దీన్ని ఎవ్వరూ డీవియేట్ చేయకండి. మనోహర్ గారి అధ్యక్షతన ఈ అలయెన్స్ ను సమన్వయ పరిచే కమిటీకి అధ్యక్షుడిగా నియమిస్తున్నాం. అలాగే.. కేంద్రంలో బీజేపీ నాయకులతో, రాష్ట్రంలో ఉన్న టీడీపీ నాయకులతో ఈ సమన్వయ పరిచే కమిటీని చర్చలకు పంపిస్తాం. సమన్వయ కమిటీ పొత్తులపై నిర్ణయం తీసుకుంటుంది అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుపై కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అప్పుడే టీడీపీ, జనసేన నేతలు మాత్రం మాకే ముఖ్యమంత్రి పదవి అంటే మాకే అంటూ కొట్టుకుంటున్నారు.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.