Virat Kohli : అన్నంత పని చేశాడు విరాట్ కోహ్లీ. మొన్న 49 సెంచరీలు చేసి సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ తాజాగా న్యూజిలాండ్ మ్యాచ్ లో మరో సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. దీంతో వన్డే మ్యాచ్ లలో 50 సెంచరీలు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు చేసి ఇప్పటి వరకు వన్డేల్లో ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా చరిత్రకెక్కాడు విరాట్ కోహ్లీ. వన్డే మ్యాచ్ లలో ఇప్పటి వరకు సచిన్ 49 సెంచరీలు చేయగా.. ఈ మ్యాచ్ లో కోహ్లీ 50 సెంచరీలు చేశాడు. భారత్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టేశాడు. కోహ్లీ ఈ మ్యాచ్ లో 117 పరుగులు చేశాడు. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు కోహ్లీ. సెంచరీ చేసి సౌతీ బౌలింగ్ లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి రికార్డు క్రియేట్ చేసి పెవిలియన్ బాట పట్టాడు.
న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో మరో జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే నేరుగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ లో ఫైనల్ కు అర్హత సాధించే మరో జట్టుతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఫైనల్ కు చేరినట్టే. అయితే.. భారత్ గట్టిగానే ఈ మ్యాచ్ లో స్కోర్ చేస్తోంది. 45 ఓవర్లలో 340కి పైగా స్కోర్ చేసింది. వికెట్లు కూడా ఇప్పటి వరకు 2 మాత్రమే పోయాయి. అందుకే న్యూజిలాండ్ కు భారీ లక్ష్యాన్ని అందించేందుకు భారత్ చెమటోడుస్తోంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.