Peddi Reddy Ramachandra Reddy : ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు : పెద్దిరెడ్డి
Peddi Reddy Ramachandra Reddy : వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి midhun reddy లిక్కర్ స్కాం కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్ట్ వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కుట్రే కారణమని పెద్దిరెడ్డి ఆరోపించారు. గతంలోనూ ఎయిర్పోర్టు మేనేజర్ను అడ్డుపెట్టుకుని తన కుమారుడిపై తప్పుడు కేసు పెట్టారని, అది నిలబడనట్లే ఇప్పుడు కూడా ఈ లిక్కర్ కేసు నిలబడదని పేర్కొన్నారు.
Peddi Reddy Ramachandra Reddy : ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు : పెద్దిరెడ్డి
ఎంపీగా మూడుసార్లు విజయం సాధించిన మిథున్ రెడ్డి, వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారన్న కారణంగానే కుట్రలు జరుగుతున్నాయని పెద్దిరెడ్డి ఆరోపించారు. మదనపల్లి ఫైళ్ల పేరిట ప్రచారం చేసినా, వాటిల్లో తమపై ఎలాంటి తప్పులు లేవని ఇప్పటికే రుజువైందన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసుల ద్వారా వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరణతో కూడిన చర్య అని, ఈ కేసు కూడా కోర్టులో నిలబడదని స్పష్టంచేశారు.
తాము ఎలాంటి తప్పూ చేయలేదని, మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పెద్దిరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై ఉన్న ద్వేషం కారణంగా ప్రభుత్వం కుట్రలు చేసుకుంటోందని, ప్రజలు ఈ దుర్మార్గాలకి తగిన సమాధానం చెప్పే రోజు దూరంగా లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, ప్రజల దృష్టి మరల్చేందుకు విపక్ష నేతల అరెస్ట్లకు తెగబడుతోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేక మహిళలు, యువతను మోసం చేస్తోందని అన్నారు.
Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు…
Anand : జగపతి బాబు Jagapathi babu, సౌందర్య, మహేశ్వరి నటించిన ‘ప్రియరాగాలు’ సినిమాలో సౌందర్య కుమారుడిగా ఆకట్టుకున్న ఆ…
Magnesium Oil : కొంతమందికి పడుకోగానే నిద్ర పట్టదు. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడతారు. ఇంకా మలబద్ధక సమస్యలతో ఇబ్బంది…
Blue Tea : ప్రకృతి ఇచ్చే మొక్కల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కొన్ని పండ్లు,ఆకులు ఆయుర్వేద మూలికల్లో ఉపయోగిస్తే,పుష్పాలను…
Vastu Tips : చాలామంది ఇళ్లల్లో పెరట్లో బొప్పాయి చెట్లను పెంచుకోవడం చేస్తూనే ఉంటాం. కొందరి అవంతటికవే బొప్పాయి చెట్లు…
Harish Rao : ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చేవి ..కానీ ఇప్పుడు ఏపీలో…
Gutta Sukhender Reddy : తెలంగాణ Telangana శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ నాయకుల మాటల…
Nitish kumar Reddy: టీమిండియాకు Team India vs England ఇంగ్లండ్తో కీలకమైన టెస్టు సిరీస్లో ముందు పెద్ద దెబ్బ…
This website uses cookies.