
Yogandhra 2025 : యోగాంధ్ర ద్వారా ఏపీ చరిత్ర సృష్టించింది .. మోడీ
Yogandhra 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 26 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ యోగా కార్యక్రమంలో 3.01 లక్షల మంది పాల్గొనడం గర్వకారణం. ఈ తరహాలో పెద్దఎత్తున యోగా నిర్వహించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. గతంలో గుజరాత్లోని సూరత్ నగరంలో 1.47 లక్షల మంది పాల్గొన్న రికార్డును ఇది అధిగమించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరై కార్యక్రమానికి మరింత ప్రతిష్టను తీసుకువచ్చారు.
Yogandhra 2025 : యోగాంధ్ర ద్వారా ఏపీ చరిత్ర సృష్టించింది .. మోడీ
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యోగ వయస్సు, ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా అందరికీ శ్రేయస్సు అందించే సాధనం అని పేర్కొన్నారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుందని చెప్పారు. యోగా ప్రతిపాదనకు ప్రపంచంలోని 175 దేశాలు మద్దతు తెలిపినదీ గర్వించదగిన విషయం. “వన్ ఎర్త్ – వన్ హెల్త్” అనే థీమ్ను ఆధారంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం యోగా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిందని ప్రశంసించారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజల్లో చైతన్యం కలిగించిందని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న వివిధ సమస్యలకు పరిష్కారంగా యోగా నిలుస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. గుండె జబ్బులు, మానసిక సమస్యలు, నరాల సంబంధిత అనారోగ్యాల చికిత్సలో యోగా ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. యోగా ద్వారా ప్రపంచ శాంతి సాధ్యం అనే సందేశాన్ని ప్రధాని ఇచ్చారు. భారతీయ సంస్కృతి పరస్పర శ్రేయస్సు కోరుకునే మానవతావాద పద్ధతిగా యోగా ద్వారా ప్రపంచానికి సందేశమిచ్చిందన్నారు. భారతదేశం ఇప్పుడు అంతర్జాతీయ ఆరోగ్య కేంద్రంగా ఎదుగుతోందని, అందుకు యోగా గొప్ప దోహదం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
Gas Cylinder : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం…
Ration Rice : మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద…
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
This website uses cookies.