Raghu Rama Krishnam Raju : నాకు టిక్కెట్ రాక‌పోవ‌డానికి కార‌ణం అదే.. జ‌గ‌న్‌కి త‌గిన గుణ‌పాఠం చెబుతానన్న ర‌ఘురామ‌..!

Advertisement
Advertisement

Raghu Rama Krishnam Raju : 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన రఘురామ కృష్ణంరాజు ఏడాదిలోనే వైసీపీకి దూరం అయ్యారు. అయితే ఆయ‌న‌పై అనర్హత వేటు పడకుండా ఐదేళ్ల పాటు లోక్‌సభలో మేనేజ్‌ చేయగలిగినా ఈ సారి పోటీ చేసే అవ‌కాశం కోల్పోయాడు. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించిన 6 లోక్‌సభ స్థానాలలో నరసాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చోటు ద‌క్క‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. న‌ర‌సాపురం లోక్ స‌భ స్థానంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్ కేటాయించ‌డంతో ర‌ఘురామ‌రాజు మ‌న‌స్థాపం చెందారు. రచ్చబండ పేరుతో నాలుగేళ్లుగా నానా రాద్ధాంతం చేసిన రఘురామ చివరకు టిక్కెట్ ద‌క్కించుకోలేక‌పోవ‌డంతో ఆయ‌న శ్రేయాభాలాషులు కూడా ఆందోళ‌న చెందుతున్నారు.

Advertisement

అయితే నరసాపురం టికెట్‌ రానందుకు తన అభిమానులు ఏ మాత్రం మ‌న‌స్థాపం చెంద‌వ‌ద్ద‌ని ఆయ‌న అన్నారు. తాను ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌క‌పోయిన కూడా ఎన్డీయేనే విజ‌యం సాధిస్తుంద‌ని, చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని అన్నారు. ఎప్ప‌టికి రాజ‌కీయాల‌లోనే ఉంటాన‌ని చెప్పిన ర‌ఘురామ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు తాను జ‌గ‌న్‌కి త‌గిన గుణ‌పాఠం చెబుతాన‌ని చెప్పుకొచ్చారు. నరసాపురం పోటీకి తనకు అవకాశం రాకుండా చేసింది జ‌గ‌నేన‌ని,ఆయ‌న‌పై త‌ప్ప‌క పోరాడ‌తాన‌ని అంటున్నారు ర‌ఘురామ‌. సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు

Advertisement

Raghu Rama Krishnam Raju : నాకు టిక్కెట్ రాక‌పోవ‌డానికి కార‌ణం అదే.. జ‌గ‌న్‌కి త‌గిన గుణ‌పాఠం చెబుతానన్న ర‌ఘురామ‌..!

త‌న‌కి టిక్కెట్ ద‌క్క‌క‌పోవ‌డంపై చాలా మంది ఆందోళ‌న చెంది త‌న‌కు ఫోన్స్‌, మెసేజ్‌లు చేస్తున్నార‌ని చెప్పిన ర‌ఘురామ ఎవ‌రు ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని సూచించారు. జ‌గన్ త‌న మతానికి చెందిన అధికారిని అడ్డం పెట్టుకొని, ఇక్కడి ప్రభుత్వ అధినేతలతో కుమ్మక్కై అక్ర‌మంగా అరెస్ట్ చేయించి జైల్లో న‌న్ను చంపించే ప్ర‌య‌త్నం చేసారని, దానిలో ఆయ‌న విఫ‌ల‌మయ్యార‌ని చెప్పుకొచ్చారు. తాత్కాలికంగా నాకు టిక్కెట్ రాకుండా జ‌గ‌న్ అడ్డుప‌డ్డారు, గత నాలుగేళ్లుగా జగన్‌ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేసిన ఇప్పుడు మూడు అడుగులు వెన‌క్కి వేస్తున్నాను. కాక‌పోతే రానున్న రోజుల్లో ప్రజాబలం, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత ముందడుగు వేయించి, జగన్‌ను అథఃపాతాళానికి తొక్కించ‌క‌పోతే నా పేరు ర‌ఘురామ‌రాజు కాద‌ని అన్నారు. కొందరు బీజేపీ నేతలకు జగన్‌కు ఉన్న సాన్నిహిత్యంతో నాకు టిక్కెట్ రాకుండా జ‌గ‌న్ అడ్డుప‌డ్డాడంటూ చెప్పుకొచ్చాడు. జ‌గ‌న్‌పై నా తిరుగుబాటు ఆగ‌దు అంటూ ర‌ఘురామ అన్నారు

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

25 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.