Simhachalam : సింహాచలం.. ప్రమాదానికి కారణం అదేనా.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..!
ప్రధానాంశాలు:
సింహాచలం.. ప్రమాదానికి కారణం అదేనా.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..!
Simhachalam : విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆలయం సమీపంలో ఇటీవల నిర్మించిన గోడ కూలిపోవడంతో 8 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మృతదేహాలను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

Simhachalam : సింహాచలం.. ప్రమాదానికి కారణం అదేనా.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..!
Simhachalam : సింహాచలం అప్పన్న చందనోత్సవం ప్రమాదానికి కారణం వారేనా..?
ఈ దుర్ఘటన చందనోత్సవ సమయంలో స్వామివారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య కలకలం రేపింది. రూ. 300 టికెట్ క్యూ లైన్ కోసం ఏర్పాటుచేసిన కాంప్లెక్స్ వద్ద చాలా మంది భక్తులు రాత్రి నిద్రలో ఉన్న సమయంలో, 2 గంటల ప్రాంతంలో పక్కనే ఉన్న కొత్త గోడ వర్షానికి కూలిపోయింది. గోడ కూలిన వెంటనే శిథిలాల కింద చిక్కిన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ గోడను కేవలం 20 రోజుల క్రితమే నిర్మించారని అధికారులు పేర్కొన్నారు.
దీనివల్ల నిర్మాణ నాణ్యతపై తీవ్రమైన ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. కాంక్రీట్ బీమ్ లేకుండా 20 అడుగుల గోడను నిర్మించడం గమనార్హం. వర్షపు నీరు మట్టితో కలసి గోడపై ఒత్తిడి పెంచడంతో, ఆ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. అధికారులు గోడకు ఇరువైపుల ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో మరింత ప్రాణనష్టం తప్పినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనకు బాధ్యులు ఎవరనే విషయంపై కాంట్రాక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.