AP Government : అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం.. రైతుల కోసం రూ.132.58 కోట్ల నిధులను విడుదల
AP Government : ఏపీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. ఖరీఫ్ పంట బీమా పథకానికి రూ.132.58 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల విడుదల ద్వారా పంట నష్టాల కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులకు ఆర్థిక భద్రత కలిగించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ‘‘అన్నదాతల కోసం కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది’’ అని హైలైట్ చేసింది.
ఈ నిధులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద విడుదల కాగా, ఇది సహజ విపత్తులు, తెగుళ్లు, వరదలు, ఎండలు వంటి కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించబడిన పథకం. 2008 నుంచి రాష్ట్రంలో “గ్రామం ఇన్సూరెన్స్ యూనిట్” విధానం అమలులో ఉండటంతో, గ్రామ స్థాయిలో కూడా నష్టాలను గుర్తించి పరిహారం అందించడానికి ఇది సహాయపడుతోంది. దీంతో రైతులు రాబోయే పంట కాలానికి రుణాలు తీసుకునే అవకాశం కూడా పొందుతారు. ఈ పథకంతో లక్షలాది మంది రైతులు లబ్దిపొందనున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
AP Government : అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం.. రైతుల కోసం రూ.132.58 కోట్ల నిధులను విడుదల
రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం. వారు దగ్గరలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శించవచ్చు లేదా https://pmfby.gov.in అనే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, భూమి పత్రాలు, బ్యాంక్ వివరాలు, పంట వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈ పథకంలో లోన్ తీసుకోని రైతులు కూడా స్వచ్ఛందంగా చేరవచ్చు. ఈ చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టే విధంగా ఉండగా, రైతు సంఘాలు దీనిని స్వాగతిస్తున్నాయి. రైతుల జీవన విధానంలో మార్పునకు ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుంది.
Advantages Of Early Dinner : ప్రారంభ భోజనం వల్ల కలిగే ప్రయోజనాలు నిస్సందేహంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ, మనలో…
Weight Loss Story : మీరు Google లో లేదా ఎవరితోనైనా బరువు తగ్గించే చిట్కాల కోసం వెతికినప్పుడు, మీకు…
Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్తగా 8వ వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…
Health Risk: సాధారణంగా తినే ఆహారాలు కలర్ ఫుల్ గా కనిపించాలంటే పలు రకాల రసాయనాళ్ళను వినియోగిస్తున్నారు. ఈ రసాయనాలు…
Zodiac Signs : 37 ఏళ్ల తర్వాత ఖగోళ శాస్త్రంలో అరుదైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయీ. న్యాయాధిపతి అయిన శని…
Sheep For Rs. 3 Lakh : ముస్లిం సోదరుల పవిత్ర పండుగ ఈద్-ఉల్-అధా (బక్రీద్) రానుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా…
kaleshwaram project : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరవడం…
KK Survey : ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయాన్ని కచ్చితంగా అంచనా వేసిన కేకే…
This website uses cookies.