YS Jagan : వైఎస్ జ‌గ‌న్‌ కు మళ్లీ ఆ సానుభూతి లభిస్తుందా..? అప్పుడేమో బాబాయ్ – ఇప్పడేమో చెల్లి ..!

Advertisement
Advertisement

YS Jagan : అప్పట్లో దేశమంతా కాంగ్రెస్ ఉంది. అన్నిటికి మించి కేంద్రంలో అధికారం ఇంకా నాలుగేళ్లు నిండుగా ఉంది.ఆ సమయంలో వైఎస్ జ‌గ‌న్‌ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీని పెట్టుకున్నారు. 2011 మే లో జరిగిన ఎన్నికల్లో పులివెందుల నుంచి వై.యస్.విజయమ్మ పోటీ చేస్తే కడప పార్లమెంటు నుంచి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేశారు.అయితే పులివెందుల నుంచి వై.యస్.విజయమ్మ మీద వివేకానంద రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.ఆయన అప్పటికి మంత్రి కూడా.అలా ఆయన పోటీ చేస్తే జనమంతా జగన్ వైపు నిలబడ్డారు.ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సాగింది. దాంతో వివేకానంద ఓడిపోయారు. ఇక జగన్ ఎంపీ సీటులో పోటీ చేసి ఐదున్నర లక్షల మెజారిటీతో గెలిచారు. తిరిగి ఇన్నాళ్లకు వైయస్సార్ కుటుంబంలో మరో చీలిక వచ్చింది. ఆనాడు వైయస్సార్ వివేకానంద కుటుంబాలలో చీలిక వస్తే జనాలు వైఎస్ జ‌గ‌న్‌ వెంట ఉన్నారు. ఆ సానుభూతి వైఎస్ జ‌గ‌న్‌ కు తోడైంది. ఈసారి ఏకంగా వైయస్సార్ కుటుంబంలో నిలువుగా చీలిక వచ్చింది. అన్నా చెల్లెలు ఇద్దరు పోటాపోటీగా ముందుకు వచ్చారు. ఒకరు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత అయితే మరొకరు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు. వాళ్ళ ఇద్దరు 2024 ఎన్నికల్లో తలపడునున్నారు. అయితే తాజాగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన విద్యా సదస్సులో కాంగ్రెస్ కి చరిత్ర పాఠాలు ఎన్ని చెప్పినా బుద్ధి రాలేదు అని అన్నారు. గతంలో నా సొంత చిన్నాన్నను మా పైన పోటీకి దించి పరాభవం పాలు అయ్యారు. ఇప్పుడు ఏకంగా నా సోదరిని నామీద పోటీగా దించారు. అయినా దేవుడు అన్ని చూసుకుంటారు. కాంగ్రెస్ కి మరోసారి పరాభవం జరగటం తధ్యమని చెప్పుకొచ్చారు.

Advertisement

కాంగ్రెస్ కి విభజించి పాలించు అన్నది బాగా అలవాటు అన్నారు. ఏపీని చీల్చింది కాంగ్రెస్ నే అని, ఇప్పుడు నా కుటుంబాన్ని కూడా రెండుగా చీల్చింది అని ఆయన అన్నారు. అన్ని ప్రజలు, దేవుడు గమనిస్తున్నారు అని ఆయన అన్నారు. అంటే ఆయన సోదరి షర్మిల విషయంలో పూర్తి తప్పు కాంగ్రెస్ దే అని అంటున్నారు. తన చెల్లెను కాంగ్రెస్ తన మీదకు ఎగదోస్తుంది అన్నది ఆయన ఆరోపణ. ఈసారి కూడా కాంగ్రెస్ కు కుతంత్రాలు, కుట్రలు సాగవని ఆయన నిబ్బరంగా ఉన్నారు. ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీ అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే జగన్ పట్ల జనంలో సానుభూతి ఈ విషయంలో ఉంటుందా అనేది చర్చ. ఇప్పటికీ 13 ఏళ్ల క్రితం జగన్ అనే కొత్త నేతను యువకుడిని జనాలు ఆదరించారు. ఆయనకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని జనాలు ఆయనకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు చూస్తే జగన్ ఐదేళ్లపాటు విపక్ష నేతగా, మరో ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. జగన్ ఏమిటో జనాలు చూశారు ఆయన పాలన చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ కుట్రలు కుతంత్రాలు తన ప్రభుత్వం మీద ప్రయోగిస్తుందని, తన కుటుంబం మీద చేస్తుందని జగన్ అంటున్నారు.

Advertisement

అయితే ఈసారి వైఎస్ జ‌గ‌న్‌ కి జనాల నుంచి అంతే స్థాయిలో సానుభూతి లభిస్తుందా అన్నది చర్చకు వస్తుంది. వైఎస్ జ‌గ‌న్‌ నా కుటుంబాన్ని చీల్చారు అని కాంగ్రెస్ తో పాటు టీడీపీ తదితర విపక్షాలు అని జనంలోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఒక సెంటిమెంట్ గా కూడా బలంగా పనిచేసే అవకాశం ఉంది. అందుకే జగన్ తన సోదరిని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు అని జనంలోకి వస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్‌ ఒంటరి పోరాటం చేస్తున్నారు జనాలు చూస్తున్నారు. కారణాలు ఏమైనా కూడా విపక్షాలు అన్ని కత్తి కట్టాయి. అయితే ఈ క్లిష్ట సమయంలో సొంత చెల్లెలు అన్నకు ఎదురుగా నిలబడి విమర్శలు చేస్తే అది జనంలో వేరే అర్థాలకు వెళుతుంది. ఈ సమయంలో ఆమె ఉండాల్సింది అన్న వైపు కదా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి వై.ఎస్.షర్మిల గత ఎన్నికల్లో అన్న పక్కన నిలబడి విజయంలో భాగమయ్యారు. ఇప్పుడు ఎదురు నిలిచి అన్నకు మళ్ళీ విజయం దక్కేలా చేస్తారేమో అని చర్చ నడుస్తుంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

36 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.