Roja : 40 లక్షల బేరం పై రోజా రియాక్షన్.. కావాలనే ఇలా చేస్తున్నారంటూ ఎమోషనల్..!
Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా నిత్యం వార్తలో నిలుస్తున్నారు. ఆమెకు సొంత పార్టీల ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈసారి రోజా అనుచర వర్గం నుంచి ఓ మహిళ నేత బయటికి వచ్చి ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో 17వ వార్డు కౌన్సిలర్ గా భువనేశ్వరి అనే మహిళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వుడ్ కావడంతో భువనేశ్వరి చైర్మన్ పదవి కట్ట పెడతామని రోజా హామీ ఇచ్చారని భువనేశ్వరి ఆరోపిస్తున్నారు. మిగిలిన విషయాలను అన్న కుమారస్వామి తో మాట్లాడాలని చెప్పారని ఆమె అన్నారు.
వార్డ్ కౌన్సిలర్ భువనేశ్వరి చేస్తున్న ఆరోపణల ప్రకారం ఆమె మంత్రి రోజా అన్న కుమారస్వామిని కలిశారు. ముందుగా కుమారస్వామి మున్సిపల్ చైర్మన్ పదవికి 70 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య 40 లక్షలకు బేరం కుదిరింది. రెండు దఫాలలో కుదుర్చుకున్న మొత్తాన్ని కుమారస్వామికి భువనేశ్వరి అందించానన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్న రెండవ దఫా చైర్మన్ ఇస్తామని చెప్పిన మాట నేటికీ నెరవేర్చలేదని, అవకాశం ఇవ్వాలని పలు దఫాలు కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందని, ఈరోజు రేపు అంటూ చెబుతున్నారని భువనేశ్వరి అంటున్నారు. అయితే రోజా చైర్మన్ పదవిని ఎన్నికల తర్వాత కట్టబెడతామని మాయమాటలు చెబుతున్నారని భువనేశ్వరి తెలిపారు. ఎన్నికల తర్వాత మాకు అవసరం లేదని స్పష్టం చేశామని ఆమె తెలిపారు.
ఇప్పుడే మాకు అమౌంట్ ఇవ్వాలని అడిగినా స్పందన లేదన్నారు. రోజాకు మెసేజ్ చేసినా, కలిసినా స్పందన లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రిపై పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారని ప్రశ్నించారు. దళిత మహిళకు న్యాయం చేయాలని సీఎం జగనన్నను కోరుతున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ విషయంపై మంత్రి రోజా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేనట్లుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి రోజాకు టికెట్ ఇస్తారా లేదా అనేది మరింత ఆసక్తికరంగా మారింది. నిజానికి రోజాకు సొంత నియోజకవర్గ అయినా నగరి నుంచి కూడా ఆమెకు వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో ఆమెకు టికెట్ రావడం కష్టమే అని అంటున్నారు
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.