
Chandrababu
TDP : ఏపీలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నట్లుగా అనిపిస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన షాక్ మామూలుది కాదు. 99 శాతం మున్సిపాలిటీలు మరియు నూరు శాతం కార్పోరేషన్ లు వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దక్కించుకున్నాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంకు కూడా వెళ్లకుండానే ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. అది ఏరకంగా అయినా కూడా పార్టీ గెలిచింది అనేది ఇక్కడ వాస్తవం. ఏపీలో తెలుగు దేశం పార్టీ ఉన్న పరిస్థితి ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు అర్థం అయ్యింది. అయినా కూడా ఆయన చూస్తూ ఉండి పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు మరో గట్టి షాక్ తగిలినట్లయ్యింది.
వైజాగ్ లో టీడీపీ కాస్త మెరుగైన ఫలితాలను దక్కించుకుంది మెజార్టీ వైకాపా కు వచ్చి మేయర్ అయినా కూడా బలమైన ప్రతిపక్షంగా మాత్రం నిలిచిందని భావించొచ్చు. మొత్తంగా టీడీపీకి జీవీఎంసీ ఎన్నికల్లో 30 సీట్లు దక్కించుకుంది. ఇది సాధారణమైన నెంబర్ ఏమీ కాదు. ఈ మొత్తం మంది టీడీపీలోనే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి ప్రభావం చూపించవచ్చు. చంద్రబాబు నాయుడు ఆ ఆశతో ఉండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనూహ్యంగా అక్కడ తన తెలివిని చూపించారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గాజు వాక నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ నుండి గెలుపొందిన మొత్తం ఏడుగురు కార్పోరేటర్లు కూడా చంద్రబాబు నాయుడుకు గుడ్ బై చెప్పి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమ్మకంతో వైకాపాలో జాయిన్ అయ్యారు.
Chandrababu
తెలుగు దేశం పార్టీ ఈ సమయంలో పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాని చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల వరకు పార్టీ మరింతగా క్షీణించి పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ పరిజ్ఞానం మరియు అనుభవంతో ఏదైనా చేస్తాడని ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇంకా ఎదురు చూస్తున్నారు. విశాఖ సంఘటన నేపథ్యంలో జంపింగ్ జిలానీలకు పార్టీ నోటీసులు ఇచ్చింది. వారు పార్టీ వీడటం ఖాయం అయిన నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చినా మరేం ఇచ్చినా కూడా ఆగేది ఏమీ ఉండదు.
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…
Fast Eating : నేటి వేగవంతమైన జీవనశైలిలో మనుషులు ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ తొందరలో…
Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…
Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…
This website uses cookies.