Missing Son Case : కొడుకు మిస్సింగ్ కేసులో హైకోర్టు వరకు వెళ్లిన తల్లి.. ఈ క్రైమ్లో మాములు ట్విస్టులు లేవు..!
ప్రధానాంశాలు:
Missing Son Case : కొడుకు మిస్సింగ్ కేసులో హైకోర్టు వరకు వెళ్లిన తల్లి.. ఈ క్రైమ్లో మాములు ట్విస్టులు లేవు..!
Missing Son Case : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కొద్ది వారాలుగా కనిపించకుండా పోయిన తన కుమారుడిని వెతకాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ తల్లి, తర్వాత హైకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే దర్యాప్తు ముమ్మరం కావడంతో వెలుగులోకి వచ్చిన నిజాలు అందరినీ షాక్కు గురి చేశాయి. కనిపించకుండా పోయిన బాలుడి హత్య వెనుక అతని తల్లే ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని జి.హొసళ్లి గ్రామానికి చెందిన 15 ఏళ్ల వీరేంద్ర కొంతకాలంగా కనిపించకుండా పోయాడు. బాలుడు కనిపించకపోవడంతో అతని తల్లి గంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా దర్యాప్తు సరిగా జరగడం లేదంటూ హైకోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో కేసును వేగవంతం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు.
Missing Son Case : కొడుకు మిస్సింగ్ కేసులో హైకోర్టు వరకు వెళ్లిన తల్లి.. ఈ క్రైమ్లో మాములు ట్విస్టులు లేవు..!
Missing Son Case ప్రేమ వ్యవహారానికి అడ్డుగా మారాడని కుమారుడి హత్య.. పోలీసుల సంచలన వెలుగులోకి తెచ్చిన ఆధారాలు
దర్యాప్తు సమయంలో గంగమ్మ ఇచ్చిన వాంగ్మూలాల్లో పలు విరుద్ధతలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాల్ డేటా, సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారాన్ని పరిశీలించిన తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయి. విచారణలో గంగమ్మకు దర్గప్ప అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు బయటపడింది. ఈ వ్యవహారాన్ని వీరేంద్ర తీవ్రంగా వ్యతిరేకించేవాడని, బంధువుల ముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడంతో తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం, తమ సంబంధానికి అడ్డుగా మారుతున్నాడనే కారణంతో గంగమ్మ తన ప్రియుడు దర్గప్పతో కలిసి వీరేంద్రను హత్య చేసినట్లు తేలింది. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా బాలుడి మృతదేహాన్ని గ్రామ శివారులోని స్మశానవాటికలో రహస్యంగా పాతిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది.
Missing Son Case హైకోర్టును ఆశ్రయించిన తల్లి.. దర్యాప్తులో బయటపడిన అసలు నిజం
కేసును మిస్సింగ్ కేసుగా చూపించి తప్పుదారి పట్టించేందుకు గంగమ్మనే స్వయంగా ఫిర్యాదు చేయడం, కుమారుడి కోసం వెతుకుతున్నట్లు నటించడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే SIT బృందం సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, కాల్ రికార్డులు, స్థానిక సాక్ష్యాలు చివరకు అసలు నేరాన్ని బయటపెట్టాయి.పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు దర్గప్పను పోలీసులు అదుపులోకి తీసుకోగా, కేసులో మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొడుకు కోసం న్యాయం కోరుతున్నట్లు కనిపించిన తల్లే చివరికి హత్య కుట్రలో పాల్గొన్నట్లు తేలడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. కుటుంబ బంధాల విలువలను ప్రశ్నించేలా ఉన్న ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.