
TDP : ఎవరు ఈమె .. నంద్యాల ఎంపీని చేయాల్సిందే అని అంటున్న టీడీపీ..!
TDP : ఏపీలో ఎన్నికల వాతావరణం కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇక వైసీపీ ఒంటరి పోరు చేస్తుండగా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక రాయలసీమలో ఈసారి ఎలాగైనా మెజారిటీ సీట్లు సంపాదించాలని చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారని అంటున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమ లో వైసీపీ టీడీపీ ను క్లీన్ స్వీప్ చేసింది. అందుకే ఈసారి రాయలసీమ ప్రాంతంలో మంచి నెంబర్ దక్కాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. అయితే ఈసారి రాయలసీమను ఒక యంగ్ లేడీ ని ఎంపీగా నిలబెట్టాలని, ఆమెను ఎలాగైనా గెలిపించాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.
లోక్ సభ స్థానాలపై కూడా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసుకుంటున్నాయి. నంద్యాల లోక్ సభ టికెట్ కోసం తెలుగుదేశం పార్టీలో పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి రాయలసీమ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే బైరిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి ఒకరికి టికెట్ ఇవ్వాలని టీడీపీ హై కమాండ్ అనుకుంటుందని అంటున్నారు. నంద్యాల లోక్ సభ టికెట్ కు బైరిరెడ్డి కూతురు బైరి రెడ్డి శబరి బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బైరిరెడ్డి శబరి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆమెకు నంద్యాల ఎంపీ టికెట్ ఖాయమని రీసెంట్గా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ అధికారికంగా టికెట్ ను ప్రకటించాల్సి ఉంది. టికెట్ ఖాయమని త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో బైరిరెడ్డి అనుచరులు నరసింహ చౌరస్తా వద్ద మిఠాయిలు కూడా పంచిపెట్టారు. బాణాసంచా కాల్చి సంబరం చేసుకున్నారు.
బైరిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి అనుకూలంగా నినాదాలు చేశారు. టికెట్ కన్ఫర్మ్ కాకముందే ఇంత హడావిడి ఎందుకని ఓ వర్గం మండిపడింది. బైరిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమించిన నేత. సీమలో ఆయనకు మంచి పేరు ఉంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి ప్రజలను రక్షించడమే ధ్యేయమని ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బైరిరెడ్డికి పాణ్యం అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఇటీవల ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఆయన టికెట్ పై చంద్రబాబునాయుడు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ బైరి రెడ్డి అనుచరులు మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇక ఆయన కూతురికి చివరికి ఏకంగా లోక్ సభ టికెట్ దక్కనిందని ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే ఆమెకు నంద్యాల ఎంపీ టికెట్ ను ఇస్తామని టీడీపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. స్థానిక రాజకీయ పరిస్థితులు సన్నిహితుల సంప్రదింపులు జరిపిన తర్వాత బైరిరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీలోకి చేరే అవకాశం ఉందని అంటున్నారు.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.