TDP : మైలవరం , పెనమలూరులో వేడెక్కుతున్న రాజకీయాలు… సందిగ్ధంలో చంద్రబాబు నాయుడు..!

Advertisement
Published by
Advertisement

TDP : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఆసక్తికరంగా మారుతున్నాయి.అనేక రకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా కృష్ణాజిల్లాలో మైలవరం నియోజకవర్గం ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుండి టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ టచ్ లోకి వెళ్లిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య టఫ్ ఫైట్ ఉంది .టికెట్ తనది అంటే తనది అంటూ పోటీపడి ప్రకటనలు చేసుకుంటున్నారు. మైలవరంలో పోటీ చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ నియోజకవర్గ టీడీపీ నేతలకు వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. అభిప్రాయ బేధాలు ఉంటే కలిసి మాట్లాడుకుందాం అని చెబుతున్నట్లు తెలుస్తుంది . త్వరలో మైలవరం లోని టీడీపి నేతలతో వసంత సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే వసంత రాకను మాజీ మంత్రి దేవినేని ఉమా మరియు బొమ్మసాని సుబ్బారావు వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారిద్దరితో చర్చలు జరిపేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇక పెనమలూరు నియోజకవర్గం విషయానికొస్తే ఈ నియోజకవర్గ రాజకీయాలలో ట్విస్ట్ మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇక టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది కుడా క్లారిటీ లేదు. అయితే నిజానికి పెనమలూరు ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గం టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తనకే టికెట్ వస్తుంది అని చెప్పుకుంటున్నారు. అయితే అధిష్టానం మాత్రం మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది .అయితే అంతలోనే మైనార్టీ నేత ఎమ్మెస్ బేక్ పేరు సర్వే నిర్వహించడంతో టీడీపీ పార్టీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారధి తుమ్మల చంద్రశేఖర్ పేరును సిఫారసు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం మైనవరం మరియు పెనుమూరు రెండు చోట్ల హై వోల్టేజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ముందుగా అసంతృప్తులను బుజ్జగించిన తర్వాత అభ్యర్థుల ప్రకటన చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

Advertisement

అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా మైలవరం మరియు పెనుమలూరు సీట్లను పెండింగ్ లో పెట్టడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ రెండు చోట్ల కూడా హై వోల్టేజ్ రాజకీయం కొనసాగుతుంది. ఎందుకంటే ఈ రెండు స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు. అయితే అక్కడ టికెట్లకు సంబంధించిన ప్రకటన చేయడానికి అధిష్టానం ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ టికెట్ల ప్రకటన చేసిన తర్వాత అసంతృప్తుల సెగ జ్వాల రగిలే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మైలవరం పెనమలూరు నియోజకవర్గాలలోని రెండు సీట్లలో ఏ విధంగా టికెట్లను ప్రకటన చేయాలి అభ్యర్థులను ఏ విధంగా బుజ్జగించాలి అనే అంశం ప్రస్తుతం అధిష్టానానికి సవాలుగా మారిన పరిస్థితి. అయితే ఇక్కడ మైలవరం నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడ పోటీ చేయడానికి సంబంధించి అన్ని రకాల ప్రయత్నాలకి సిద్ధపడుతున్నారు అని సమాచారం. అలాగే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో అక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమా మరియు బొమ్మసాని సుబ్బారావు వీళ్ళి ఇద్దరు కూడా ఉన్నారు.

Advertisement

అయితే ఇక్కడ టికెట్ వీరి ఇద్దరికీ లేకుండా వేరే వారికి అంటే వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ కనుక కేటాయిస్తే భారీ ఎత్తున నిరసన తలెత్తుతుంది అని చెప్పాలి. కాబట్టి వారిద్దరిని కూడా ముందు బుజ్జగించి ఆ తర్వాత టికెట్టును ప్రకటన చేయాలి అనే అంశంపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ మండల కీలక నేతలకు ఫోన్ చేసి టచ్ లోకి వెళ్లారు. తనకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కాబ్బటి మీరు నాతో కలిసి పని చేస్తే గతంలో ఉన్న విభేదాలు అన్నిటినీ కూడా సర్దుబాటు చేసుకుందామని ఆయన ఫోన్లో చెప్పినట్టు కూడా సమాచారం. ఇక పూర్తిస్థాయిలో మైలవరం అంశం అనేది చాలా సున్నితమైన అంశం కాబట్టి అందరం వేచి చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు టికెట్లు రాని నేతలను బుజ్జగించడానికి అధిష్టానం అన్ని రకమైన చర్యలు తీసుకుంటుంది అని తెలుస్తుంది. అయితే పెనమలూరు సంబంధించి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో దేవినేని ఉమా పేరు కూడా అక్కడ పరిశీలిస్తున్నారు.

అయితే వైసీపీ కి సంబంధించి పార్థసారథి కూడా టికెట్ ఆశించారు. అయితే ఆయనకు నూజివీడు టికెట్ నీ కేటాయించిన నేపథ్యంలో ఆయన వర్గానికి సంబంధించి మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ పేరుని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ టికెట్ మీద అనేక పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల పేర్లు పరిశీలిస్తున్న నేపథ్యంలో వేరే వారికి టికెట్ ఇస్తే కనుక బోడె వర్గం కూడా ఆందోళనకు దిగే అవకాశం ఉంది. కాబట్టి పెనమలూరు అంశాన్ని కూడా సున్నితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఎమ్మెస్ బేక్ పేరును కూడా ఐవిఆర్ సర్వేలో పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే పెనుమలూరు మైలవరం ఈ రెండు టికెట్లు సంబంధించిన ప్రకటనకు అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాలలోని రాజకీయాలు పై వోల్టేజ్ తో నడుస్తున్నాయని చెప్పాలి. మరి ఈ రాజకీయ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Advertisement

Recent Posts

Lemon Ginger Tea : రోజూ లెమన్ జింజర్ టీ తాగితే అద్భుత ప్రయోజనాలు..?

Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…

51 minutes ago

EMI : ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్..? ఆర్బీఐ కొత్త రూల్‌పై క్లారిటీ..!

EMI  : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…

10 hours ago

Peddi Movie : పెద్ది’ క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్.. చివరి 40 నిమిషాలు మైండ్ బ్లోయింగ్..? బుచ్చిబాబు

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…

11 hours ago

TDP NDA : టీడీపీకి మరో గవర్నర్ పదవి..? చంద్రబాబు నిర్ణయంపై ఆసక్తికర చర్చ..!

TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…

13 hours ago

Bhuma Mounika : రాజకీయాల్లోకి మౌనిక రెడ్డి ఎంట్రీ.. అసలు ప్లాన్ ఏంటో బయటపెట్టిన మంచు మనోజ్!

Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…

15 hours ago

New Pension : కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్.. ఎవరు అర్హులు? పూర్తి మార్గదర్శకాలు ఇవే..!

తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…

16 hours ago

Heatwave : భానుడి భగభగ.. 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. ప్రజలకు IMD హెచ్చరిక

Heatwave  : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…

18 hours ago

Sabja Juice Recipe : చల్లచల్లగా వాటర్‌మెలన్ సబ్జా డ్రింక్.. వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ నేచురల్ జ్యూస్

వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్‌,…

19 hours ago

Personality Fruit Test : మీకు ఇష్టమైన పండు ఏది? దానిబట్టి మీ అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది!

Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…

21 hours ago

Summer Breakfast : సమ్మర్‌కు బెస్ట్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. ఇంట్లోనే సాఫ్ట్ పింక్ బీట్‌రూట్ ఇడ్లీలు ఇలా చేయండి..!

Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…

22 hours ago

Andhra Pradesh : ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊరేగించిన గ్రామస్తులు

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…

1 day ago

MeeSeva : మీ సేవా ఆఫీసులకు ఇక గుడ్‌బై.. వాట్సాప్‌లోనే GHMC 9 సేవలు!

హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…

2 days ago