TDP : మైలవరం , పెనమలూరులో వేడెక్కుతున్న రాజకీయాలు… సందిగ్ధంలో చంద్రబాబు నాయుడు..!

Advertisement
Published by
Advertisement

TDP : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఆసక్తికరంగా మారుతున్నాయి.అనేక రకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా కృష్ణాజిల్లాలో మైలవరం నియోజకవర్గం ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుండి టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ టచ్ లోకి వెళ్లిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య టఫ్ ఫైట్ ఉంది .టికెట్ తనది అంటే తనది అంటూ పోటీపడి ప్రకటనలు చేసుకుంటున్నారు. మైలవరంలో పోటీ చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ నియోజకవర్గ టీడీపీ నేతలకు వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. అభిప్రాయ బేధాలు ఉంటే కలిసి మాట్లాడుకుందాం అని చెబుతున్నట్లు తెలుస్తుంది . త్వరలో మైలవరం లోని టీడీపి నేతలతో వసంత సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే వసంత రాకను మాజీ మంత్రి దేవినేని ఉమా మరియు బొమ్మసాని సుబ్బారావు వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారిద్దరితో చర్చలు జరిపేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇక పెనమలూరు నియోజకవర్గం విషయానికొస్తే ఈ నియోజకవర్గ రాజకీయాలలో ట్విస్ట్ మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇక టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది కుడా క్లారిటీ లేదు. అయితే నిజానికి పెనమలూరు ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గం టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తనకే టికెట్ వస్తుంది అని చెప్పుకుంటున్నారు. అయితే అధిష్టానం మాత్రం మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది .అయితే అంతలోనే మైనార్టీ నేత ఎమ్మెస్ బేక్ పేరు సర్వే నిర్వహించడంతో టీడీపీ పార్టీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారధి తుమ్మల చంద్రశేఖర్ పేరును సిఫారసు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం మైనవరం మరియు పెనుమూరు రెండు చోట్ల హై వోల్టేజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ముందుగా అసంతృప్తులను బుజ్జగించిన తర్వాత అభ్యర్థుల ప్రకటన చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

Advertisement

అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా మైలవరం మరియు పెనుమలూరు సీట్లను పెండింగ్ లో పెట్టడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ రెండు చోట్ల కూడా హై వోల్టేజ్ రాజకీయం కొనసాగుతుంది. ఎందుకంటే ఈ రెండు స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు. అయితే అక్కడ టికెట్లకు సంబంధించిన ప్రకటన చేయడానికి అధిష్టానం ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ టికెట్ల ప్రకటన చేసిన తర్వాత అసంతృప్తుల సెగ జ్వాల రగిలే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మైలవరం పెనమలూరు నియోజకవర్గాలలోని రెండు సీట్లలో ఏ విధంగా టికెట్లను ప్రకటన చేయాలి అభ్యర్థులను ఏ విధంగా బుజ్జగించాలి అనే అంశం ప్రస్తుతం అధిష్టానానికి సవాలుగా మారిన పరిస్థితి. అయితే ఇక్కడ మైలవరం నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడ పోటీ చేయడానికి సంబంధించి అన్ని రకాల ప్రయత్నాలకి సిద్ధపడుతున్నారు అని సమాచారం. అలాగే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో అక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమా మరియు బొమ్మసాని సుబ్బారావు వీళ్ళి ఇద్దరు కూడా ఉన్నారు.

Advertisement

అయితే ఇక్కడ టికెట్ వీరి ఇద్దరికీ లేకుండా వేరే వారికి అంటే వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ కనుక కేటాయిస్తే భారీ ఎత్తున నిరసన తలెత్తుతుంది అని చెప్పాలి. కాబట్టి వారిద్దరిని కూడా ముందు బుజ్జగించి ఆ తర్వాత టికెట్టును ప్రకటన చేయాలి అనే అంశంపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ మండల కీలక నేతలకు ఫోన్ చేసి టచ్ లోకి వెళ్లారు. తనకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కాబ్బటి మీరు నాతో కలిసి పని చేస్తే గతంలో ఉన్న విభేదాలు అన్నిటినీ కూడా సర్దుబాటు చేసుకుందామని ఆయన ఫోన్లో చెప్పినట్టు కూడా సమాచారం. ఇక పూర్తిస్థాయిలో మైలవరం అంశం అనేది చాలా సున్నితమైన అంశం కాబట్టి అందరం వేచి చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు టికెట్లు రాని నేతలను బుజ్జగించడానికి అధిష్టానం అన్ని రకమైన చర్యలు తీసుకుంటుంది అని తెలుస్తుంది. అయితే పెనమలూరు సంబంధించి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో దేవినేని ఉమా పేరు కూడా అక్కడ పరిశీలిస్తున్నారు.

అయితే వైసీపీ కి సంబంధించి పార్థసారథి కూడా టికెట్ ఆశించారు. అయితే ఆయనకు నూజివీడు టికెట్ నీ కేటాయించిన నేపథ్యంలో ఆయన వర్గానికి సంబంధించి మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ పేరుని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ టికెట్ మీద అనేక పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల పేర్లు పరిశీలిస్తున్న నేపథ్యంలో వేరే వారికి టికెట్ ఇస్తే కనుక బోడె వర్గం కూడా ఆందోళనకు దిగే అవకాశం ఉంది. కాబట్టి పెనమలూరు అంశాన్ని కూడా సున్నితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఎమ్మెస్ బేక్ పేరును కూడా ఐవిఆర్ సర్వేలో పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే పెనుమలూరు మైలవరం ఈ రెండు టికెట్లు సంబంధించిన ప్రకటనకు అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాలలోని రాజకీయాలు పై వోల్టేజ్ తో నడుస్తున్నాయని చెప్పాలి. మరి ఈ రాజకీయ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Advertisement

Recent Posts

Coconut Water : రోజూ ఒక కొబ్బరి బొండాం తాగితే మీ శరీరంలో జరిగే ఈ పన్నెండు అద్భుతాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Coconut Water  : ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన పానీయాలలో కొబ్బరి నీళ్లు మొదటి వరుసలో…

56 minutes ago

Chanakyaniti : ఎవరినైనా నమ్మే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి…!

Chanakyaniti : ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప వ్యూహకర్త మరియు అర్థశాస్త్ర కోవిదుడు. ఆయన రాసిన చాణక్య నీతి నేటి…

3 hours ago

Telangana Farmers : వరి సాగు మానేస్తే ఎకరాకు రూ.10 వేల సాయం.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

Telangana Farmers  : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక శుభవార్త…

12 hours ago

Gas Cylinder Offer: గ్యాస్ సిలిండర్ ఇస్తే నెల మొత్తం ఫ్రీ ఫుడ్.. హోటల్ యజమాని బంపర్ ఆఫర్..!

Gas Cylinder Offer: వ్యాపారం అన్నాక లాభనష్టాలు సహజం. కానీ ఆ వ్యాపారాన్ని నడపడానికి అవసరమైన ముడిసరుకులే దొరకకపోతే ఆ…

13 hours ago

Ys Sharmila And YS Jagan : షర్మిల కి సూపర్ బంపర్ ఛాన్స్.. జగన్ కి వెన్నులో వణుకు పుట్టే బ్రేకింగ్ న్యూస్

Ys Sharmila And YS Jagan : రాజకీయాల్లో కాలం ఎప్పుడు ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేం. ఇప్పుడు ఏపీ…

14 hours ago

Pakistan and India issue : PAKISTHAN లో అత్యవసర RED ALERT .. HIT LIST తో దిగిన భారత జవాన్లు .. దేశం మొత్తం వణుకుతున్నారు

Pakistan And India Issue: భారత్ పాకిస్థాన్ మధ్య ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు కనిపిస్తున్నాయి. భారత్…

15 hours ago

Raghav Chadha : నా నోరు నొక్కితే గెలిచినట్లు కాదు.. సొంత పార్టీపై రాఘవ్‌ చడ్డా సంచలన వ్యాఖ్యలు.. BJP లోకి ఎంట్రీ కన్ఫర్మ్?

Raghav Chadha : జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీలో Aam Aadmi Party ఇప్పుడు సంచలన పరిణామాలు…

17 hours ago

Indiramma Indlu Phase 2 : పేదలకు డబుల్ గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. ‘భూ భారతి’ పోర్టల్ ప్రారంభం

Indiramma Indlu Phase 2 తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు, సొంతిల్లు లేని వారికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం…

18 hours ago

Chandrababu and KCR : రాజ్యసభ లో సపోర్ట్ చేసినందుకు థాంక్స్ .. KCR కి చంద్రబాబు ఫోన్ ?

Chandrababu and KCR : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఇప్పుడు…

20 hours ago

Paytm Gas Cylinder Offer : వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే రూ.200 క్యాష్‌బ్యాక్.. అస్సలు మిస్సవకండి!

Paytm Gas Cylinder Offer : సామాన్యుడి జేబుకు ప్రతి నెలా చిల్లులు పడుతున్న రోజులివి. పెరుగుతున్న నిత్యావసర సరుకుల…

21 hours ago

Gold Silver Rate 3rd April 2026 : మహిళలకు శుభవార్త.. ఒక్కరోజే మళ్లీ రూ.4 వేలు తగ్గిన బంగారం ధర.. వెండి రూ.10 వేలు డౌన్

Gold Silver Rate 3rd April 2026 పసిడి ప్రియులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్…

22 hours ago