
Rajadhani : మనోవేదనకి గురవుతున్న అమరావతి రైతులు.. అవమానిస్తున్నారంటూ ఆవేదన.!
Rajadhani : ఏపీలో ప్రభుత్వం మారింది.. కూటమి అధికారంలోకి వచ్చింది.. అమరావతికి పట్టిన గ్రహణం వీడింది.. రాజధానికి మంచిరోజులొచ్చాయి.. తద్వారా రైతుల తలరాతలు మారబోతున్నాయి.. ఐదేళ్ల రైతుల కష్టాలు తీరబోతున్నాయి.. ఇదంతా నాణానికి ఒక పక్క మాత్రమే! రెండోవైపు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా.. అసైన్డ్ రైతుల తలరాతలు మాత్రం మారలేదు. వైసీపీ పాలనలో మొదలైన వారి ఆకలి కేకలు, ఆర్తనాదాలు ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయి. కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలూ అమలుకు నోచక విలవిల్లాడుతున్నారు. సీఎం చంద్రబాబే తమ గోడు వినిపించుకోవాలని వేడుకుంటున్నారు.
రాజధాని కోసం 3,139 మంది అసైన్డ్ రైతులు 2,689.14 ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేశారు. అప్పట్లో ఆ భూములు ప్రభుత్వానికి ఇవ్వొద్దని కొందరు వారిపై ఒత్తిడి తెచ్చినా భూములిచ్చారు. వైసీపీ హయాంలో ఆ రైతులపై సీఐడీ కేసులు పెట్టింది. ఆ భూములపై సీఐడీ విచారణకు ఆదేశించింది. అప్పటి వరకూ ఫారం- 9.14 కింద ఏడేళ్లపాటు వారికి ఇచ్చిన కౌలును, సీఐడీ విచారణ సాకుతో ఆపేసింది. ఇప్పటికీ వెయ్యి కుంటుంబాలకు చెందిన 1650 ఎకరాల భూమి నాట్ ట్యాలీడ్ జాబితాలోనే ఉంది. దీంతో వారికి కౌలు రావడంలేదు. వైసీపీ ప్రభు త్వం కక్షపూరితంగా పెట్టిన సీఐడీ కేసులనే సాకుగా చూపి కౌలు చెల్లించకుండా ఆపేశారు. కూటమి ప్రభుత్వం పట్టాదారు రైతులకు కౌలు చెల్లించినా, అసైన్ట్ రైతుల కౌలు మాత్రం చెల్లించలేదు.
Rajadhani : మనోవేదనకి గురవుతున్న అమరావతి రైతులు.. అవమానిస్తున్నారంటూ ఆవేదన.!
ప్రభుత్వం మారినా సీఆర్డీఏ అధికారుల తీరు మారలేదు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే నేటికీ అవమానాలే ఎదురవుతున్నాయని కౌలు రైతులు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితి కంటే అత్యంత అమానవీయంగా అధికారుల తీరు ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. సాక్షాత్తూ సీఆర్డీఏ అదనపు కమిషనరే తమను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆక్రోశిస్తున్నారు. ఇక, అసైన్డ్ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రస్తుత తాడికొండ ఎమ్మెల్యే వారికి ఇటీవల హామీ ఇచ్చినా.. ఆచరణ లేదు. దీనిపై రైతులు ఆయనను మరోమారు ప్రశ్నించగా.. మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ను కలవండని ఉచిత సలహా ఇచ్చినట్లు అసైన్డ్ రైతులు చెబుతున్నారు.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.