Categories: andhra pradeshNews

Rajadhani : మ‌నోవేద‌న‌కి గుర‌వుతున్న అమ‌రావ‌తి రైతులు.. అవ‌మానిస్తున్నారంటూ ఆవేద‌న‌.!

Advertisement
Advertisement

Rajadhani : ఏపీలో ప్రభుత్వం మారింది.. కూటమి అధికారంలోకి వచ్చింది.. అమరావతికి పట్టిన గ్రహణం వీడింది.. రాజధానికి మంచిరోజులొచ్చాయి.. తద్వారా రైతుల తలరాతలు మారబోతున్నాయి.. ఐదేళ్ల రైతుల కష్టాలు తీరబోతున్నాయి.. ఇదంతా నాణానికి ఒక పక్క మాత్రమే! రెండోవైపు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా.. అసైన్డ్‌ రైతుల తలరాతలు మాత్రం మారలేదు. వైసీపీ పాలనలో మొదలైన వారి ఆకలి కేకలు, ఆర్తనాదాలు ఇప్పటికీ అలానే కొన‌సాగుతున్నాయి. కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలూ అమలుకు నోచక విలవిల్లాడుతున్నారు. సీఎం చంద్రబాబే తమ గోడు వినిపించుకోవాల‌ని వేడుకుంటున్నారు.

Advertisement

Rajadhani అన్నీ అవ‌మానాలే..

రాజధాని కోసం 3,139 మంది అసైన్డ్‌ రైతులు 2,689.14 ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేశారు. అప్పట్లో ఆ భూములు ప్రభుత్వానికి ఇవ్వొద్దని కొందరు వారిపై ఒత్తిడి తెచ్చినా భూములిచ్చారు. వైసీపీ హయాంలో ఆ రైతులపై సీఐడీ కేసులు పెట్టింది. ఆ భూములపై సీఐడీ విచారణకు ఆదేశించింది. అప్పటి వరకూ ఫారం- 9.14 కింద ఏడేళ్లపాటు వారికి ఇచ్చిన కౌలును, సీఐడీ విచారణ సాకుతో ఆపేసింది. ఇప్పటికీ వెయ్యి కుంటుంబాలకు చెందిన 1650 ఎకరాల భూమి నాట్‌ ట్యాలీడ్‌ జాబితాలోనే ఉంది. దీంతో వారికి కౌలు రావడంలేదు. వైసీపీ ప్రభు త్వం కక్షపూరితంగా పెట్టిన సీఐడీ కేసులనే సాకుగా చూపి కౌలు చెల్లించకుండా ఆపేశారు. కూటమి ప్రభుత్వం పట్టాదారు రైతులకు కౌలు చెల్లించినా, అసైన్ట్‌ రైతుల కౌలు మాత్రం చెల్లించలేదు.

Advertisement

Rajadhani : మ‌నోవేద‌న‌కి గుర‌వుతున్న అమ‌రావ‌తి రైతులు.. అవ‌మానిస్తున్నారంటూ ఆవేద‌న‌.!

ప్రభుత్వం మారినా సీఆర్డీఏ అధికారుల తీరు మారలేదు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే నేటికీ అవమానాలే ఎదురవుతున్నాయని కౌలు రైతులు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితి కంటే అత్యంత అమానవీయంగా అధికారుల తీరు ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. సాక్షాత్తూ సీఆర్డీఏ అదనపు కమిషనరే తమను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆక్రోశిస్తున్నారు. ఇక, అసైన్డ్‌ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రస్తుత తాడికొండ ఎమ్మెల్యే వారికి ఇటీవల హామీ ఇచ్చినా.. ఆచరణ లేదు. దీనిపై రైతులు ఆయనను మరోమారు ప్రశ్నించగా.. మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్‌ను కలవండని ఉచిత సలహా ఇచ్చినట్లు అసైన్డ్‌ రైతులు చెబుతున్నారు.

Recent Posts

Gold Price on Jan 21 : తగ్గినట్లే తగ్గి..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర..ఈరోజు తులం బంగారం ఎంతంటే?

Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…

37 minutes ago

Karthika Deepam 2 Today Episode : జ్యోత్స్న రహస్యం బయటపడే ప్రమాదం.. ఆగ్రహంతో ఊగిపోయిన శివ నారాయణ

Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…

1 hour ago

Box Office 2026 : టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో సువర్ణ అధ్యాయం .. 10 రోజులు, 5 సినిమాలు, 800 కోట్లు..!

Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…

2 hours ago

Home Remedies: ఇంట్లో కీటకాల బెడదకు చెక్: రసాయనాలు లేకుండా ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే పరార్..!

Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…

3 hours ago

Blue Berries : బ్లూ బెర్రీ తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అసలు వదులరు అవేంటో తెలుసా?

Blue Berries : మార్కెట్‌లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…

4 hours ago

Zodiac Signs : జ‌న‌వ‌రి 21 బుధవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

5 hours ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి స్కెచ్ మాములుగా లేదు.. హ‌రీష్ త‌ర్వాత టార్గెట్ కేటీఆర్, కేసీఆర్..!

Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…

13 hours ago

Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కోచింగ్‌పై మండిపడుతున్న అభిమానులు .. వరుస ఓటములతో పెరుగుతున్న ఒత్తిడి..!

Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…

14 hours ago