Brother Wife : ఎంతకు తెగించావురా.. వదినపైనే కన్నేసిన కామాందుడు.. అర్ధరాత్రి యాసిడ్ పట్టుకొని వెళ్లి మరీ..!
ప్రధానాంశాలు:
అన్న భార్యపైనే కన్నేసిన తమ్ముడు.. ఎవ్వరు లేని సమయంలో ఇంట్లో కి వెళ్లి !!
Brother Wife : సాధారణంగా అన్న భార్యను తల్లిలా భావించి గౌరవించడం మన సంస్కృతి. అయితే పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో ఓ వ్యక్తి ఈ పవిత్ర బంధానికి తలవంపులు తెచ్చాడు. ఏడాదిన్నర క్రితం భర్తను కోల్పోయి, ముగ్గురు పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటూ కూలి పనులకు వెళ్తున్న 34 ఏళ్ల వదినపై మరిది శామ్యూల్ కన్నేశాడు. అండగా ఉండాల్సిన వాడే ఆమె పాలిట యముడయ్యాడు. గతంలోనే ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా, పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి హెచ్చరించారు. ఆ సమయంలో ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరిన నిందితుడు, మనసులో మాత్రం తన క్రూరత్వాన్ని అలాగే దాచుకున్నాడు.
Brother Wife : ఎంతకు తెగించావురా.. వదినపైనే కన్నేసిన కామాందుడు.. అర్ధరాత్రి యాసిడ్ పట్టుకొని వెళ్లి మరీ..!
Brother Wife : మృగంగా మారిన మరిది.. వదినపైనే అత్యాచారయత్నం
పెద్దల ముందు క్షమాపణలు చెప్పినప్పటికీ శామ్యూల్లో మార్పు రాలేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన అతడు, ఆ బాధితురాలిని నిరంతరం వేధిస్తూనే ఉన్నాడు. తన కోరిక తీర్చకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16వ తేదీ రాత్రి, ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి మరోసారి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమె ధైర్యంగా ఎదిరించడంతో, ముందే పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న యాసిడ్ను ఆమెపై పోసేందుకు ప్రయత్నించాడు. తృటిలో ఆమె ఆ ప్రమాదం నుండి తప్పించుకోగా, నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఇది కేవలం వేధింపు మాత్రమే కాదు, పథకం ప్రకారం జరిగిన హత్యాయత్నంగా కనిపిస్తోంది.
వరుసగా జరుగుతున్న ఈ దాడులతో తీవ్ర మనస్థాపానికి, భయాందోళనకు గురైన ఆ మహిళ చివరకు పోలీసులను ఆశ్రయించింది. బుధవారం తన బంధువులతో కలిసి రొంపిచర్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు, తన పిల్లలకు ఆ నిందితుడి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న శామ్యూల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాజంలో ఒంటరి మహిళలపై జరుగుతున్న ఇటువంటి అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.